అనుష్క శెట్టి సినీ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపుగా 14 సంవత్సరాలైంది.  ఈ 14 సంవత్సరాల్లో అనేక సినిమాలు చేసింది.  అరుంధతి ఆమెకు ఓ మైలురాయి.  ఆ తరువాత ఆ తరహా సినిమాలు అనేకం చేసింది.  బాహుబలి సీరీస్, భాగమతి సినిమాతో మరో రేంజ్ కు వెళ్ళిపోయింది.  ప్రస్తుతం ఈ హీరోయిన్ సైలెన్స్ అనే హర్రర్ ఎంటర్టైనర్ సినిమా చేస్తోంది.  


సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత తనతో పాటు అనేకమంది ప్రయాణం సాగించారు.  అందులో ఆమె అసిస్టెంట్ రవి కూడా ఒకరు.  ఏడేళ్ల క్రితం రవి హఠాత్తుగా మరణించాడు.  రవి మరణం ఆమెను కలిచివేసింది.  ఇప్పటికి రవి మరణించి ఏడేళ్లయింది.  ఏడేళ్ల తరువాత కూడా రవిని గుర్తు పెట్టుకొని తనతో కలిసి తీసుకున్న  మీడియాలో షేర్ చేసింది.  


"నిజంగా మనల్ని ప్రేమించే వారు మనల్ని వదిలి ఎక్కడికీ వెళ్లరు. మరణం అందుకోలేనివి కూడా కొన్ని ఉంటాయి.. గత 14 ఏళ్లు నాది ఓ ప్రయాణం. మీకు బాగా దగ్గరైన వ్యక్తి ఇక మీ జీవితంలో ఉండరని తెలిసినప్పుడు.. వారు మీ జీవితంలోని కొంత భాగాన్ని తీసుకెళ్తారని అర్థం చేసుకోండి. బ్యూటిఫుల్‌ రవి కన్నుమూసి ఏడేళ్లు అవుతోందంటే ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది. మరణం తర్వాత ఏంటి? అనే విషయం నాకు తెలియదు.. కానీ అతడు నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాడు" అని మెసేజ్ చేసింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: