సౌత్ లో ఉన్న టాప్ హీరోయిన్లలో 'త్రిష కృష్ణన్' ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటు ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అందం, అభినయాలతో ఈ స్థాయికి చేరుకున్న త్రిష కి ఎన్నో సంవత్సరాలుగా 'సూపర్ స్టార్ రజనీకాంత్' తో నటించాలన్న కోరిక బలంగా ఉండేది. ఆ కోరిక రీసెంట్గా 'పేట' సినిమాతో నెరవేరింది. నయనతార, అనుష్కలా కుటుంబకథా చిత్రాలు, రొమాంటిక్ ప్రేమ కథా చిత్రాల్లో నటించి సక్సెస్ అయిన త్రిష హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో నటించి హిట్ కొట్టాలన్న ఫాంటసీ మాత్రం ఇంకా తీరలేదు.
అంతేకాదు త్రిష ఎంతో ఇష్టపడి నటించిన 'నాయకి' సినిమా కూడా బాగా నిరాశ పరిచింది. ఆ తరువాత నటించిన 'మోహిని' అయితే పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. అయినప్పటికి ఏమాత్రం డిసప్పాయింట్ అవకుండా గర్జన, 1818, పరమపదం విళైయాట్టు వంటి సినిమాల్లో నటిస్తున్నా, అవి ఇంకా అండర్ ప్రొడక్షన్ లోనే ఉన్నాయి. ఇక త్రిష రీసెంట్గా నటిస్తున్న సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ కథ కావడం విశేషం. దీనికి ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథ, సంభాషణలను అందించారు. శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు.
లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా తొలిషెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి 'రాంగీ' అనే టైటిల్ను నిర్ణయించారు. ఈ సినిమాతోనైనా లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో సక్సెస్ కావాలన్న త్రిష ఆశ నెరవేరేనా? అన్న ఆసక్తి నెలకొంది. ఇక రీసెంట్గా త్రిష నటించిన 96, పేట చిత్రాలు విజయం సాధించాయి. అదే సక్సెస్ రాంగీ సినిమాకీ కంటిన్యూ అవుతందనే నమ్మకంతో ఉందట త్రిష.