సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు మ‌హ‌ర్షి సినిమాను ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ త‌న 26వ ప్రాజెక్టు ప‌నుల్లో బిజీ కానున్నాడు. ఏకే ఎంట‌ర్‌టైన్స్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అనిల్ సుంక‌ర నిర్మించే ఈ సినిమాకు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఎఫ్ 2 సినిమాతో అనిల్ రావిపూడి టాలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రిగా మారిపోయాడు. ఇక ఈ సినిమాలో అదిరిపోయే కామెడీ సీన్ల‌తో అనిల్ ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.


ఇక ఇప్పుడు ఈ సినిమాకు రెడ్డి గారి అబ్బాయి అనే వ‌ర్కింగ్ టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇక అనిల్ గ‌తంలో శ్రీను వైట్ల ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా ప‌నిచేశాడు. ఇక ఇప్పుడు తాను మ‌హేష్‌తో చేస్తోన్న సినిమా కోసం ర‌వితేజ సినిమాలోని కామెడీ సీన్‌ను పోలిన సీన్ల‌ను ఇక్క‌డ రాసుకుంటున్నాడ‌ట‌. శ్రీను వైట్ల - ర‌వితేజ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన వెంకీ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో కామెడీ సీన్లు ఇప్ప‌టికే యూట్యూబ్‌లో పేలిపోతుంటాయి. వీటికి ఇప్ప‌టికే ల‌క్ష‌ల్లో వ్యూస్ కంటిన్యూగా వ‌స్తున్నాయి.


ఈ సినిమాలో ట్రైయిన్ ఎపిసోడ్ మామూలుగా నవ్వించ‌లేదు. ఇది ఇప్ప‌ట‌కీ బుల్లితెర మీద, యూట్యూబ్‌లో ఎక్కువ మంది చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉంటుంటారు. బ్రహ్మానందం, ఏవీఎస్, శ్రీనివాసరెడ్డి, రవితేజతో పాటు చేసిన కామెడీ నానా ర‌చ్చ చేసింది. ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా సేమ్ టు సేమ్ అలాగే మ‌హేష్ సినిమా కోసం ట్రైన్‌లో ఉండే ఓ కామెడీ సీన్‌ను రాసుకున్న‌ట్టు ఈ సినిమా కోసం ప‌నిచేస్తోన్న టీం ద్వారా మేట‌ర్ లీక్ అయ్యింది. ర‌ష్మిక మంద‌న్న ఈ సినిమాలో హీరోయిన్ కాగా.. జూన్ సెకండ్ వీక్ నుంచి ఈ సినిమా సెట్స్‌మీద‌కు వెళ్ల‌నుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: