సూపర్ స్టార్ మహేష్, వంశీ పడిపల్లి కాంబినేషన్ లో మహేష్ 25వ సినిమాగా వచ్చిన మహర్షి సినిమా ఇప్పటికే సంచలన విజయం అందుకుంది. వసూళ్లతో రికార్డులను సృష్టిస్తున్న మహర్షి సినిమా విజయంతో మరో సినిమా చర్చల్లోకి వచ్చింది. అదే కృష్ణవంశీ తీద్దామనుకున్న రైతు. స్టార్ హీరో రైతుగా నటిస్తే ఎవరైనా చూస్తారా అన్నదానికి సమాధానంగా మహర్షి సెన్సేషనల్ హిట్ అందుకుంది.


అయితే మహర్షిలో మహేష్ రైతుగా చివర్లో మారతాడు. కాని కృష్ణవంశీ ఏకంగా హీరో క్యారక్టరైజేషన్ రైతుగా రాసుకున్నాడు. బాలకృష్ణ 100వ సినిమా కథల్లో ఇది కూడా ఒకటి. కృష్ణవంశీ డైరక్షన్ లో కథ ఫైనల్ అవగా బిగ్ బి అమితాబ్ ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ కోసం అడగడానికి ముంబై వెళ్లారు.. ఆయన ఈ ఆఫర్ సున్నితంగా కాదనడం.. ఆ తర్వాత ప్రాజెక్ట్ అటకెక్కడం జరిగింది.


అయితే మళ్లీ మహర్షి హిట్ తో కృష్ణవంశీ రైతు సినిమాకు క్రేజ్ వచ్చింది. ఈమధ్యనే ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన కృష్ణవంశీ బాలయ్య ఒప్పుకుంటే ఇప్పటికైనా రైతు సినిమా చేసేందుకు తాను సిద్ధమే అని అన్నాడు. అంటే ఎక్కడో ఓ చోట రైతుగా హీరో అంటే ప్రేక్షకులు చూస్తారో లేదో అనుకున్నా మహర్షి ఫలితంపై ఆ డౌట్ క్లారిఫై అయినట్టే.


మహర్షి లో మహేష్ 3 వేరియేషన్స్ లో నటించాడు. అయితే కృష్ణ వంశీ సినిమాల్లో బాలయ్య కేవలం రైతుగా మాత్రమే కనిపిస్తాడట. మరి మహర్షి స్పూర్తితో రైతు మళ్లీ ట్రాక్ ఎక్కుతుందా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ రైతుగా బాలయ్య చేయకున్నా మరో హీరో అయినా ప్రయత్నించే ఛాన్స్ ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: