నందామయా ఆనందామయా అంటూ కియారా అద్వానీ బోల్డ్ గా పలకరిస్తే కిర్రాకే మరి. అందం నాదయా చూపులు నీవయా. ఆనందించవయా అంటూ ఘాటుగా రెచ్చిపోతే యూత్ ఎక్కడో పడిపోతుంది. కియారా తెలుగులో భరత్ అను నేను తో సూపర్ స్టార్ మహేష్ బాబు తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తరువాత రాం చరణ్ తో వినయ విధేయ రాం చేసింది. ఇపుడు ఆమె బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది.


బాలీవుడ్లో నాలుగైదు సినిమాల్తో బిజీగా వున్న కియారా అద్వానీ ప్రస్తుతం కబీర్ సింగ్ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఇక తాజాగా అమ్మడు ఒక మ్యాగజైన్ కోసం చేసిన హాట్ ఫోటో షూట్ ని చూస్తే కియారా లో ఇంతందం దాగుందా అని అనిపించక మానదు. పీకాక్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం కియరా చేసిన హాటెస్ట్ ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ పీకాక్ మ్యాగజైన్ కవర్ పేజీపై కియరా ఇచ్చిన హాటెస్ట్ ఫోజుకి కుర్రకారుకి గుండె లయ తప్పడం ఖాయం.


అమ్మో కియారా అంటూ వెర్రెక్కిపోతారంతే. కియారా గురి చూసి మరి చిట్టి గుండెలను తట్టి లేపేసింది. ఆ రెచ్చగొట్టుడు ఓ రేంజిలో ఉందంటున్నారు. మరీ ఇంత బోల్డ్ గానా అన్న వారు ఉత్త  చాదస్తులే. అయినా కియారా టార్గెట్ వేరు. వారు సోషల్ మీడియాలో కియారా విశ్వరూపం చూసి తరిస్తారు, పరితపిస్తారు అంతే. నిజానికి  కియారా ఎప్పటికప్పుడు తన అందాలను సోషల్ మీడియా ద్వారా ఫోటో షూట్స్ రూపంలో చూపిస్తూనే ఉంది. 


కానీ ఈసారి మాత్రం అసలు కనికరమే లేకుండా కుర్ర గుండేల్లో రంపం కోత పెట్టేసింది. మళ్ళీ తప్పు నాది కాదంటోంది. ఈసారి కియారా సౌత్ పై కన్నేసిందని అంటున్నారు. మళ్ళీ టాలీవుడ్లో తన హవా చాటడానికి జస్త్ టేస్ట్ చూడు అన్నట్లుగా వదులుతున్నా ఈ ఫోజులకు ఫిదా అయిపోతున్నారంతా. కియారా తెలుగు తెరపై వెలిగిపోవా అని పిలుస్తున్నారు కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి: