సాయి ధరమ్ తేజ్ వరుస సినిమాలతో హిట్ కొడుతూ సుప్రీం హీరోగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. గత నెలలో తేజ్ నటించిన చిత్రలహరి ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా తన ముందు సినిమాలకు మించిన కలెక్షన్ లను సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికిగా, నివేదా పేతురాజ్ కీలక పాత్రలో పోషించారు. అసలు విషయమేమిటంటే చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన ప్రతి సినిమా ఏదో ఒక ప్రైమ్ లోకి వచ్చేస్తుంది. ఈ చిత్రం విడుదలై 35 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెజాన్ ప్రైమ్ సంస్థ చిత్రలహరిని తన ఖాతాలో పెట్టేసింది.
తాజాగా అమెజాన్ ప్రైమ్లో విడుదల కావడం, ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. సాయిధరమ్ నటనను, కథ ఎంపికను మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో వీటిని చూసిన హీరో ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘ఇప్పుడు నేను విభిన్నమైన ఎమోషన్లో ఉన్నా.. ఈ ట్వీట్లు చూస్తుంటే ‘చిత్రలహరి’ ఈ వారంలో విడుదలైన భావన కలుగుతోంది. ప్రేక్షకులు సినిమా చూసి రివ్యూ రాసినట్లు అనిపిస్తోంది. ఎదురుచూసి మరీ అమెజాన్లో చూసిన వారందరికీ ధన్యవాదాలు. పైరసీని ప్రోత్సహించనందుకు కృతజ్ఞతలు’ అని సాయిధరమ్ ట్వీట్ చేశారు.