ఈ మద్య రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు..గాయపడుతున్నారు. ఆ మద్య నందమూరి హరికృష్ణ, రవితేజ తమ్ముడు ఇలా ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో తనువు చాలించారు. అయితే అత్యంత వేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ఇలా ఎన్నో కారణాల వల్ల ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా..ఈ ప్రమాదాలను నివారించలేక పోతున్నారు.
తాజాగా నటుడు, యాంకర్, ఆర్జే హేమంత్ కారు ప్రమాదం జరిగింది. అయితే ఈ రోడ్డు ప్రమాదం లో హేమంత్ కారులో నుంచి తప్పించుకున్నాడు. ఈ మద్య మహేష్ బాబు నటించిన ‘మహర్షి’సినిమాలో నటించాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. విజయవాడలో ‘మహర్షి’ సక్సెస్ మీట్ కు హాజరైన హేమంత్ హైదరాబాద్ కు తిరిగి వెళుతున్నారు.
ఈ క్రమంలోనే హేమంత్ కారు ఈరోజు పల్టీకొట్టింది. హేమంత్ కారు జగ్గయ్యపేట మండలం మహమ్మద్ క్రాస్ రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా ఓ గేదె ప్రత్యక్షమైంది. దాన్ని తప్పించబోయిన హేమంత్ కారుతో గేదెను ఢీకొట్టాడు. దీంతో అదుపు తప్పిన వాహనం పల్టీలు కొట్టింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.