పూరి జగన్నాథ్ ఎన్నో ప్రేమ చిత్రాలను తీసి ప్రేక్షకుల మనస్సుల్లో నిలిచిపోయారు. పూరి ప్రతి సినిమాలో ప్రేమ అంటే ఇంత కష్టంగా ఉంటుందా... ప్రేమిస్తే ఇంత హాయిగా ఉంటుందా అని మాటల్లో చెప్పలేని విధంగా చిత్రాన్ని నిర్మిస్తాడు. పూరి కేవలం దర్శకుడు మాత్రమే కాదు కథ కూడా తానే రాసుకుంటాడు. బాలకృష్ణ చేసిన పైసా వసూలు పూర్తి స్థాయిలో తన అప్పులను సైతం వసూల్ చేసేంది. దీంతో తన కుమారుడు ఆకాష్ హిరోగా మెహబూబా చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం అనుకున్నంత వసూలు చేయలేకపోయింది. మళ్లీ అప్పుల్లో కూరుకుపోయాడు. అయినా తన వెనక్కి తగ్గకుండా రామ్ కథానాయకుడిగా మరో చిత్రన్ని నిర్మిస్తున్నాడు.


రామ్‌-పూరీ జగన్నాథ్ కాంబోలో విడుదలకు సిద్ధమౌతున్న చిత్రం  'ఇస్మార్ట్‌ శంకర్‌'. రామ్ బర్తడే గిఫ్ట్ గా టీజర్ ను రిలీజ్ చేశాడు. ఈ టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే పెంచాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు..ఈ ఫిల్మ్ హక్కుల్ని సొంతం చేసుకునేందుకు ఓ ప్రముఖ సంస్థ ముందుకొచ్చినట్టు టాక్. రూ.20 కోట్లకు ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. డీల్ ఓకే అయితే.. ముందుగా రూ.10 కోట్లు అడ్వాన్స్‌గా ఇస్తామని, మిగిలినది రిలీజ్‌కు ముందు ఇస్తామని అన్నారట.


పరిస్థితి గమనించిన ఛార్మి.. టీజర్‌, ట్రైలర్‌ విడుదలైతే ఇస్మార్ట్ రేటు పెరుగుతుందని ఆలోచన చేసిందట. దీంతో ఫస్ట్ ఆఫర్ మిస్సయ్యింది. ఈసారి 'ఇస్మార్ట్'ని ఎవరు సొంతం చేసుకుంటారో? అన్నట్లు మే లో దీన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కాకపోతే నిధి అగర్వాల్ పాస్‌పోర్ట్ పోవడంతో షూటింగ్ డిలే అయ్యింది. పూరీ జగన్నాథ్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: