రామ్-పూరీ జగన్నాథ్ కాంబోలో విడుదలకు సిద్ధమౌతున్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. రామ్ బర్తడే గిఫ్ట్ గా టీజర్ ను రిలీజ్ చేశాడు. ఈ టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే పెంచాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు..ఈ ఫిల్మ్ హక్కుల్ని సొంతం చేసుకునేందుకు ఓ ప్రముఖ సంస్థ ముందుకొచ్చినట్టు టాక్. రూ.20 కోట్లకు ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. డీల్ ఓకే అయితే.. ముందుగా రూ.10 కోట్లు అడ్వాన్స్గా ఇస్తామని, మిగిలినది రిలీజ్కు ముందు ఇస్తామని అన్నారట.
పరిస్థితి గమనించిన ఛార్మి.. టీజర్, ట్రైలర్ విడుదలైతే ఇస్మార్ట్ రేటు పెరుగుతుందని ఆలోచన చేసిందట. దీంతో ఫస్ట్ ఆఫర్ మిస్సయ్యింది. ఈసారి 'ఇస్మార్ట్'ని ఎవరు సొంతం చేసుకుంటారో? అన్నట్లు మే లో దీన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కాకపోతే నిధి అగర్వాల్ పాస్పోర్ట్ పోవడంతో షూటింగ్ డిలే అయ్యింది. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.