తేజ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన తాజా చిత్రం సీత‌. కవచం సినిమా తర్వాత మరోసారి కాజల్, బెల్లంకొండ కలిసి నటిస్తున్న సినిమా ఇది. అది సెట్స్‌పై ఉన్నపుడే ఈ చిత్రానికి కూడా కమిటయ్యారు ఈ జోడీ. త్వరలోనే ఈ చిత్రం ఈ నెల 24న‌ విడుదల కానుంది. వ‌ర‌స‌గా రెండు సినిమాలు చేస్తున్నారు క‌దా.. ఇప్పుడు ఈ ఇద్ద‌రూ పుల్‌గా దోస్తులు అయిపోయారు. అందుకే క‌లిసి మ‌జా చేస్తున్నారు. ఆ మ‌ధ్య కిలికి ఛాలెంజ్ అప్పుడు కూడా బెల్లంకొండ‌తో క‌లిసి డాన్సులు చేసింది కాజ‌ల్. ఇక ఆ తర్వాత ఏకంగా ఆయ‌న భుజాల‌పై ఎక్కి పోజిచ్చింది. త‌న‌కంటే జూనియ‌ర్.. పైగా వ‌య‌సులో కూడా జూనియ‌ర్ అయినా కూడా ఆ భేష‌జాలేం లేకుండా బెల్లంకొండ వార‌సుడితో క‌లిసిపోయింది కాజ‌ల్. ఇప్పుడు సీతలో కాజల్ విలన్ కారెక్టర్‌లో నటిస్తుందని తెలుస్తుంది. పూర్తిస్థాయి విలన్ పాత్రలోనే ఒదిగిపోతుంది చందమామ.


బెల్లంకొండ, కాజల్ కెమిస్ట్రీ సినిమాకు హెల్ప్ అవుతుందంటున్నారు తేజ. కవచం పోయినా కూడా కాజ‌ల్‌తో నటిస్తున్న ఈ సినిమా మాత్రం త‌న కెరీర్‌ను మార్చేస్తుందని చెబుతున్నారు బెల్లంకొండ వార‌సుడు. కాజ‌ల్‌కు ఏకంగా మూడున్న‌ర కోట్ల‌కు పైగానే ప్యాకేజ్ అందింద‌ని తెలుస్తుంది. తేజ సినిమా కాజ‌ల్ ఒప్పుకోడానికి కార‌ణం గురువు కావ‌డ‌మే.


ఈ చిత్రం కోసం రిస్కీ ఫైట్స్ చేశానని అంటోంది కథానాయిక కాజల్. 'ఈ సినిమా కోసం కాస్త రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. ఓ సీన్ లో అయితే, రెండు వందల కేజీల ఐస్ గడ్డల్ని మీద వేసుకుని ఫైట్ చేశాను. రియల్ ఫైట్స్ కూడా చేశాను. అలా ఈ సినిమా కోసం శారీరకంగా కూడా కష్టపడ్డాను' అని చెప్పింది.  మొత్తానికి చూడాలిక‌.. ఈ సీత ఎలా ఉండ‌బోతుందో..?



మరింత సమాచారం తెలుసుకోండి: