టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు వరుస విజయాలతో దూసుకు పోతున్నారు.  భరత్ అనే నేను తర్వాత మహర్షి మరో బ్లాక్ బస్టర్.  ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా నటిస్తున్నారు.  వరస హిట్స్ తో టాప్ డైరెక్టర్ స్థానానికి ఎగబాకుతున్న అనిల్ రావిపూడి మరో సెన్సేషన్ హిట్ కోసం సరికొత్త ప్లాన్ లో ఉన్నారట. ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇది యాక్షన్ ఎంటర్టైనర్ అని అందరికి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇందులో ట్రైన్ నేపథ్యంలో వచ్చే కామెడీ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుందనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఆ ఎపిసోడ్ కోసం అనిల్ బాగా రాసుకున్నాడని తెలుస్తుంది. 


ఇప్పటి వరకు టాలీవుడ్ లో ట్రైన్ సీన్లు ఎన్నో వచ్చాయి..అందులో కడుపుబ్బా నవ్వించే కామెడీ అయితే..బీభత్సం సృష్టించే సన్నివేశాలు వచ్చాయి.  ఆ మద్య  రవితేజ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన వెంకీ సినిమాలో ఓ ట్రైన్ ఎపిసోడ్ ఉంటుంది.  రవితేజ అండ్ గ్యాంగ్ ఒక రేంజ్ లో నవ్వులు పూయిస్తారు. బ్రహ్మానందం తో రవితేజ చేసే కామెడీ ఇప్పటికి తలుచుకుంటే నవ్వొస్తూనే ఉంటుంది.  ఆ సీన్లు టీవిల్లో ఇప్పటికీ వస్తూనే ఉంటాయి..అభిమానులు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. 


అలాంటి కామెడీ సీన్ ఈ సినిమాలో ఉండబోతుందట.  ట్రైన్ ఎపిసోడ్ మహేశ్ బాబు, బండ్ల గణేశ్, శ్రీనివాస రెడ్డి తదితరులపై ఉంటుందని అంటున్నారు. ప్రసుతం మహర్షి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మహేష్ వచ్చే నేలనుండి ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ పాల్గొననున్నాడు. ఇక అనీల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి రిలీజ్ అయిన ఎఫ్ 2 భారీ కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: