డైరెక్టర్ తేజ అనే పేరు కొన్నేళ్ల క్రితం ఒక సెన్సేషన్ అనే చెప్పుకోవాలి. అయన ఉదయ్ కిరణ్, రీమాసేన్ జంటగా తీసిన తొలి సినిమా 'చిత్రం' సూపర్ హిట్ అయి, తొలి సినిమాతోనే దర్శకుడిగా ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. ఇంక ఆ తరువాత అయన తీసిన నువ్వు నేను, జయం సినిమాలు తేజకు మరింత పేరును తీసుకువచ్చాయి. ఇక ఆ తరువాత తొలిసారి స్టార్ హీరో అయిన మహేష్ తో కలిసి అయన తెరకెక్కించిన నిజం అనే సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ విమర్శకుల ప్రశంశలు మాత్రం అందుకుంది. 

ఇక ఆ తరువాత తేజ ప్రాభవం మాత్రం మెల్లగా తగ్గుతూ వచ్చింది. ఇక మళ్ళి ఇన్నేళ్లకు ఇటీవల అయన రానా తో తీసిన నేనే రాజు నేనే మంత్రి సినిమా మంచి విజయవంతమయి ఆయనకు బ్రేక్ ని ఇచ్చింది. అయితే ఆ తరువాత అయన ఎన్టీఆర్ బయోపిక్ ను డైరెక్ట్ చేయవలసింది, అయితే కొన్ని అనివార్య కారణాల వలన అయన ఆ సినిమా నుండి తప్పుకున్నారు. ఇక మళ్ళి ఇప్పుడు అయన కాజల్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జతగా సీత అనే సినిమాను తీశారు. ఇక అన్ని కార్యక్రమాలు పూతి చేసుకుని ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి కాజల్ కు కూడా తెలుగు కొన్నాళ్ల నుండి సరైన విజయం లేదు, ఇక హీరో సాయి శ్రీనివాస్ కూడా ఫ్లాప్ ల్లోనే వున్నాడు. కాబట్టి వారిద్దరికీ ఈ సినిమాతో హిట్ అవసరం అనే చెప్పాలి. 

ఇక ఇప్పటికే హిట్ కొట్టిన తేజ మరోక్కసారి ఈ సినిమాతో విజయం అందుకుంటే మాత్రం దర్శకుడిగా అయన మళ్ళి బిజీ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలు మరియు ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో, సినిమా కూడా తప్ప్పకుండా విజయాన్ని సాధిస్తుంది ఆ సినిమా యూనిట్ ధీమాను వ్యక్తం చేస్తుంది. ఇక ఈ సినిమాలో కాజల్ తన కెరీర్ లో ఇప్పటివరకు పోషించని ఒక వైవిధ్యమైన పాత్ర పోషిస్తోందని, తప్పకుండా సినిమా విడుదల తరువాత కాజల్ కు ఈ సినిమా మంచి పేరును తీసుకువస్తుందని అంటున్నారు. మరి ఇంకొక నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో చూద్దాం....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: