ఎస్.జే సూర్య..ఈ డైరెక్టర్ పేరు చెప్పగానే తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన 'వాలీ', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ 'ఖుషీ' తో పాటు డిజాస్టర్స్ అయిన నానీ, కొమరం పులి కూడా గుర్తొస్తాయి. అంటే దర్శకుడిగా బ్లాక్ బస్టర్ సినిమాలకు.. డిజాస్టర్లకు కూడా దర్శకత్వం వహించాడు. ఇలా దర్శకుడిగా వరస ఫెయిల్యూర్లు చూస్తున్న సమయంలో కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'ఇరైవి'. ఈ సినిమాలో నటించడంతో ఎస్ జే సూర్య కెరీర్ మలుపు తిరిగింది. 


ఆ తర్వాత కంప్లీట్‌గా దర్శకత్వానికి ఫుల్ స్టాప్ పెట్టి పూర్తి స్థాయి నటుడిగా కొనసాగుతున్నాడు. 2017 లో వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'స్పైడర్' సినిమా ఫ్లాప్ అయింది. కానీ అందులో ఎస్ జే సూర్య మాత్రం విలన్ గా తన నటనతో అందరినీ మెప్పించాడు.  ఇక సూర్య హీరోగా నటించిన 'మాన్ స్టర్' అనే తమిళ సినిమా రీసెంట్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమాకు నెల్సన్ వెంకటేశన్ డైరెక్టర్ కాగా హీరోయిన్ గా ప్రియ భవాని శంకర్ నటించింది. ఈ సినిమాలో మధ్యతరగతి వ్యక్తిగా ఒక ఎలుక వల్ల కష్టాలు పడే పాత్రలో సూర్య అద్భుతంగా నటించాడు. 

ఈ సినిమాతో నటుడిగా సూర్య టాలెంట్ ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిందంటే ఏ రేంజ్ లో ఆ పాత్రను పోషించాడో తెలుస్తుంది. ఈ సినిమా నటుడిగా ఎస్ జే సూర్యకు ఒక మరపురాని సినిమా అని కోలీవుడ్‌లో అంటున్నారు. ఎస్.జే సూర్య చేతిలో ప్రస్తుతం అర డజనుకు పైగా ప్రాజెక్టులు ఉన్నాయట.  అంటే ఇక ఎస్.జే సూర్యను మెగా ఫోన్ పట్టనివ్వకుండా సూర్యను అవకాశాల వర్షంలో ముంచేస్తున్నట్టే. అంతేకాదు స్టార్ హీరోలకు సైతం చెక్ పెట్టబోతున్నాడనమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: