తెలుగుసినిమా పరిశ్రమకు ప్రాణం పోసాడు పవన్ కళ్యాణ్. మూడు నెలలుగా దివాళా తీసి దిగాలు పడుతున్న తెలుగు సినిమా వాళ్లకు అత్తారిల్లు చక్కటి పలితం ఇచ్చింది. అంతే కాదు మంచి సినిమా లేక ఉసూరు మంటున్న సినీ ప్రేక్షకులకు పండగకు ముందే దసరా సంబరాలను చూపించింది ‘అత్తారింటికి దారేది’ అన్నది అక్షర సత్యం.

పైరసీ కావడం ఓ రకంగా ‘అత్తారింటికి దారేది’ సినిమా కు దారి చూపించింది. దీంతో ఏమైనా ఫర్వాలేదంటూ దైర్యం చేసి ముందుగానే విడుదల చేసారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఈ సినిమా హిట్టుకు ఆటంకం కలిగిస్తుంది అంటూ భయపడ్డారు. అందుకు తగ్గట్టు గానే తెలంగాణలో అడ్డుకుంటామని ఓయు జేఏసి, సీమాంద్రలో అడ్డుకుంటామని సమైక్య జేఏసి లు హెచ్చరించాయి కూడా.

అయితే సినిమా విడుదలతో ఈ భయాలన్ని పటాపంచలయ్యాయి. సినిమా వేరు రాజకీయం వేరు అని అభిమానులు రుజువు చేసారు. బాక్సాఫీసు బద్దలు చేసింది, కలెక్షన్ల పంట పండించింది. దీంతో మిగతా వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: