మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, గత ఏడాది పవన్ కళ్యాణ్ తో చేసిన అజ్ఞాతవాసి సినిమాతో భారీ డిజాస్టర్ ని అందుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఆ సినిమా తరువాత అయన కెరీర్ కూడా చాలా వరకు ఇబ్బందుల్లో పడ్డట్లు కొన్ని పుకార్లు కూడా వచ్చాయి. అయితే అనంతరం అయన, ఎన్టీఆర్ తో తీసిన అరవింద సమేత సినిమా సూపర్ హిట్ కొట్టి, ఆయనకు కెరీర్ పరంగా మళ్ళి పునర్వైభవాన్ని ఇచ్చింది. ఇక అతిత్వరలో అయన, బన్నీ హీరోగా కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఇక ఇప్పటికే పూజ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో జరుపుకోనుంది. తన అరవింద సమేతలో హీరోయిన్ గా నటించిన పూజ హెగ్డేనే ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు త్రివిక్రమ్. 

అంతేకాదు ఆమె బన్నీ తో డీజే తరువాత రెండవసారి జత కడుతోంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది. అదేమిటంటే, గతంలో బన్నీ, త్రివిక్రమ్ కంబినేషన్లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా తండ్రి కొడుకులు నేపథ్యంలో రూపొందిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం వీరి నూతన చిత్రం కూడా ఇటువంటి కథాంశంతోనే రూపుదిద్దుకోబోతోందని అంటున్నారు. నిజానికి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాను త్రివిక్రమ్ తెరకెక్కించిన తీరుకు, అలానే అందులో బన్నీ నటనకు విమర్శకుల ప్రశంశలు కూడా దక్కాయి. 

ఇక ప్రస్తుతం రూపొందుతున్న ఈ సినిమా కూడా అంతకు మించిన మంచి కథ, కథనాలతో రూపొందితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ మూడవ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే చెప్పవచ్చు. ఇక డీజే, నాపేరు సూర్య సినిమాలతో కాస్త ఢీలా పడ్డ బన్నీ, ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్ళి ఫామ్ లోకి రావాలని చూస్తున్నారు. అయన ఆశలు తప్పక ఫలిస్తాయని, ఈ సారి బన్నీ తప్పకుండ హిట్ కొడతారని అయన అభిమానులు ముందస్తుగానే అంచనాలు వేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో విడుదల తరువాత ఈ సినిమా ఎంతమేర విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మాత్రం మరికొన్ని నెలలు ఓపికపట్టాల్సిందే.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: