పి నారాయణ మూర్తి పేరు వినగానే మనకు ఎర్రసైన్యం, దండోరా, చీమల దండు, ఒరేయ్ రిక్షా వంటి అద్భుతమైన చిత్రాలు గుర్తుకు వస్తాయి.  నారాయణ మూర్తి కెరీర్ మొదట్లో సాటిలేని మేటి చిత్రాలను అందించాడు.  కర్షక, కార్మిక కోసం ఆయన తీసిన చిత్రాలకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు అంటే అర్ధం చేసుకోవచ్చు.  టెక్నాలజీ  అందుబాటులోకి వచ్చాక... అయన సినిమాలు తీయడం తగ్గించేశారు.  ఇప్పటి తారానికి అనుగుణంగా ఆయన సినిమాలు చేయలేరు.  ఒకవేళ తన తహారలోనే సినిమాలు చేసినా చూసేవాళ్ళు కరువు. 

అందుకే నారాయణ మూర్తి సినిమాలు చేయడం తగ్గించేశారు.  ఇప్పుడు మరలా మెగాఫోన్ పట్టుకొని రంగంలోకి దిగారు.  అంగట్లో ప్రజాస్వామ్యం పేరుతో రాయకీయాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ సినిమా చేశారు.  ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతున్నది.  దీనికి సంబంధించిన ఆడియో వేడుక మంగళవారం రోజున ప్రసాద్ లాబ్స్ లో జరగబోతున్నది.  ఈ ఆడియో వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రాబోతున్నారు.  


నారాయణ మూర్తి సినిమా ఆడియో వేడుకకు మెగాస్టార్ వస్తున్నారు అనే సరికి ఆ సినిమాకు హైప్ క్రియేట్ అయ్యింది.  మార్కెట్ పరంగా సినిమాకు మైలేజ్ వస్తుంది.  రాజకీయాలకు సంబంధించిన సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి ఉంటుంది.  మెగాస్టార్ వస్తున్నారు కాబట్టి ఆడియో కూడా బాగుందే ఉండాలి.  నారాయణ మూర్తి సినిమాలకు సాహిత్యం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: