డైరెక్టర్ తేజ తనకు రావాల్సిన అవుట్ ఫుట్ కోసం హీరోయిన్స్ ను బాగా కష్టపెడతాడని టాక్ వినిపిస్తుంటుంది. ఇప్పుడీ లిస్ట్ లోకి కాజల్ కూడా చేరింది. సీత సినిమా టైమ్ లో తేజ తన నడుము విరగ్గొట్టేశాడని కంప్లయిట్ చేసింది కాజల్. "తేజ మన పెర్ఫార్మెన్స్ చూడడు. మన కళ్లు చూస్తాడు. అందులో పెర్ఫార్మెన్స్ కనిపించాలంటాడు. ఏదైనా చేయండి నాకు మాత్రం కళ్లలో భావాలు కనిపించాలంటాడు. చాలా అలసిపోయాను. ఫిజియో థెరపీ కూడా చేయించుకున్నాను.. ఒక దశలో నా కాళ్లపై నేను నిలబడలేకపోయాడు.


నా నడుము భాగానికి వేసిన ప్లాస్టర్లతోనే నేను నటించాను. సినిమాలో కూడా ఆ కట్లు కనిపిస్తాయి. ఆ సీన్ ఉంచారో లేక కట్ చేశారో నాకు తెలీదు."  ఇలా తేజ తనను హింసించిన విషయాన్ని బయటపెట్టింది కాజల్. అయినప్పటికీ అన్నీ భరించానని, ఎందుకంటే సీత సినిమాలో పాత్ర అంటే తనకు అంత ఇష్టమని అంటోంది. మరోవైపు తను నిర్మాతగా మారబోతున్న విషయాన్ని కూడా అధికారికంగా బయటపెట్టింది కాజల్. 


"కేఏ వెంచర్స్ బ్యానర్ పెట్టాలనే ఆలోచన ఉంది. అయితే అది ప్రస్తుతానికి ఇంకా ఆలోచన దశలోనే ఉంది. ఇంకా రిజిస్టర్ కూడా చేయలేదు. అంతలోనే అది మీడియాకు ఎలా పొక్కిందో అర్థంకావడం లేదు. ఇప్పటికిప్పుడు నిర్మాతగా మారాలని అనుకోవడం లేదు. ఇంకాస్త టైమ్ పడుతుంది. బ్యానర్ కు కేఏ వెంచర్స్ అనే పేరు పెట్టడం మాత్రం ఖాయం." రాజ్ కందుకూరి కొడుకు సినిమాకు తను ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నానని, అది కేవలం ఫార్మాలిటీ మాత్రమేనని, ఆ సినిమా ప్రొడక్షన్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది కాజల్. మరోవైపు తమన్నాతో కలిసి నటించే అంశంపై కూడా రియాక్ట్ అయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: