పెళ్లి చేసుకున్న ఏ జంటనైనా ఆరునెలలు కాగానే అడిగే మొదటి ప్రశ్న.. ఏమైనా విశేషమా.. అని.. ఇది ఇండియాలో కామన్. కానీ లేటు వయస్సులో పెళ్లయితే.. ఆ జంట పరిస్థితి ఏంటి.. అందులోనూ మరీ నలభై ఏళ్లకు దగ్గర్లో పెళ్లి చేసుకున్న జంటల పరిస్థితి ఏంటి..? 


ఇందుకు సమాధానంగా నిలుస్తోందో సెలబ్రెటీ జంట. సోనీ టీవీలో వచ్చే ఎఫ్.ఐ.ఆర్ ద్వారా ప్రేక్షకులకు చేరువైన నటి కవితా కౌశిక్. ఆమె రెండేళ్ల క్రితం రోనిత్​ బిశ్వాస్​ను పెళ్లి చేసుకుంది. ఆ జంట పిల్లలను కనకూడదని షాకింగ్ నిర్ణయం తీసుకుందట. 

తాను ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వివరించింది కవితా కౌశిక్.. ఆమె ఏమంటుందంటే.. ప్రస్తుతం ఇద్దరం నలభై ఏళ్లకు దగ్గరగా ఉన్నాం. ఇప్పట్లో పిల్లల్ని కనాలనుకోవడం లేదు. పోనీ కొంతకాలం తర్వాత పిల్లల్ని కంటే అప్పటికే మాకు నలభై ఏళ్లొస్తాయి.

పిల్లలకు ఇరవై ఏళ్లొచ్చేసరికి మాకు అరవై వచ్చి, ముసలోళ్లం అవుతాం. అంటే మా పిల్లలు ఇరవై ఏళ్లలోనే వృద్ధులైన మమ్మల్ని చూసుకోవాల్సి వస్తుంది. దీంతో వాళ్ల యవ్వనంలో చాలా త్యాగాలు చేయాల్సి వస్తుంది. జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేరు. అందుకే  పిల్లల్ని కని వాళ్లను ఇబ్బంది పెట్టే కన్నా లేకుండా ఉంటేనే మంచిదని నిర్ణయించుకున్నాం అంటోంది కవితా కౌశిక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: