అల్లు వారబ్బాయి అర్జున్ ఇప్పటికే టాలీవుడ్ లో పెద్ద హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయన నటించిన గంగోత్రి మొదలుకుని మొన్నటి నాపేరు సూర్య వరకు ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి, ప్రేక్షకుల నుండి మంచి పేరు సంపాదించారు అర్జున్. ఇక అన్నబాటలోనే గౌరవం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన తమ్ముడు శిరీష్ మాత్రం ఇప్పటివరకు ఐదు తెలుగు మరియు ఒక మలయాళ సినిమాలో నటించినప్పటికీ కూడా మంచి విజయాన్ని మాత్రం తన ఖాతాలో వేసుకోలేకపోయారు. 

ఇక మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అయన నటించిన ఎబిసిడి సినిమా పర్వాలేదనిపించేలా కలెక్షన్లు సాధిస్తోంది. అయితే ఆయనకు కెరీర్ పరంగా ఇది పెద్ద బూస్ట్ నిచ్చే సినిమా అయితే కాదంటున్నారు సినీ విశ్లేషకులు. అందుకే శిరీష్ భవిష్యత్తులో రాబోయే సినిమాలపై మరింత దృష్టిపెట్టనున్నట్లు సమాచారం. ఇక తదుపరి అయన చేయబోయే సినిమాకు దర్శకుడిగా ఇటీవల నితిన్ హీరోగా నటించిన కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రేమ్ సాయి ని దర్శకుడిగా ఎంచుకున్నారట. 

అప్పట్లో మెగాస్టార్ నటించిన శంకర్ దాదా జిందాబాద్ సినిమాకు అసోసియేట్ దర్శకుడిగా పనిచేసిన ప్రేమ్ సాయి, ఆ తరువాత దర్శకుడిగా మారి ఇప్పటివరకు మూడు సినిమాలు తీశారు. ఇక తమిళనాట మంచి అభిరుచిగల దర్శకుడని పేరున్న ప్రేమ్ సాయిని శిరీష్ ఎంచుకున్నారు అంటే, వీరి కాంబినేషన్లో రాబోయే సినిమాలో కూడా మంచి అంశం ఏదో ఉండి ఉటుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే ఈ వార్తపై ఇప్పటివరకు శిరీష్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు, కేవలం కొన్ని మీడియా వర్గాల్లో ప్రచారమవుతున్న కథనం మాత్రమే. ఒకవేళ ఈ వార్త కనుక నిజం అయితే శిరీష్ మంచి సినిమాను ప్రేక్షకులకు అందిస్తారని చెప్పవచ్చు.....!!! 


మరింత సమాచారం తెలుసుకోండి: