ప్రధాని నరేంద్ర మోడీ జీవిత చరిత్ర ఆధారాంగా ‘పీఎం నరేంద్ర మోదీ’ మోడీ బయోపిక్ ను రుపొందించారు. ఇందులో మోడీ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించారు. కేంద్రంలో మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్పోల్స్ వెల్లడించడంతో సోమవారం వివేక్ ఈ సినిమాకు సంబంధించిన ఓ కొత్త పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను చూసి ప్రధాని నరేంద్రమోడీ అనుకుని పొరబడ్డారని అంటున్నారు. ఒమంగ్ కుమార్ దర్శకుడు. వేడుకలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా పాల్గొన్నారు. మోడీ శంఖం ఊదుతున్నట్లుగా ఉన్న ఆ పోస్టర్పై ‘మళ్లీ మోడీనే వస్తారు. ఇక ఎవ్వరూ ఆపలేరు’ అని రాసుండటం గమనార్హం.
‘ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో మేం సంతోషంగా ఉన్నాం. భాజపాకు తక్కువ సీట్లు వస్తాయని చాలా మంది అన్నారు. కానీ మేమెప్పుడూ భయపడలేదు. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నప్పుడు కూడా మోడీజీ పట్ల ప్రజలకు ఉన్న అభిమానమెంతో తెలిసింది. గాంధీనగర్లోని మహాత్మా గాంధీ మందిర్లో ఓ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నప్పుడు అందరూ నన్ను చూసి నిజంగానే మోదీ వచ్చారని అనుకున్నారు. ‘మోడీ మోడీజీ’ అంటూ నినాదాలు చేశారు. ఇన్నేళ్లలో మోడీ ప్రజల కోసం ఎంతో మంచి చేశారు. అందుకే ప్రజలు కూడా ఆయన్ని మనస్ఫూర్తిగా స్వీకరించారు’ అని వెల్లడించారు.
ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఎన్నికల నిబంధన కారణంగా చిత్రం విడుదలను వాయిదా వెస్తూ వచ్చిన చిత్ర బృంధం ఎట్టకేలకు ఆదివారంతో సార్వత్రిక ఎన్నికలు ముగియటంతో మే 24న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.