విలన్ గా, కమెడియన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో శ్రీహరికి ఎంతో మంచి పేరున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లోనే కాదు ఇతర భాషల్లోను నటుడిగా శ్రీ హరి తన సత్తా చాటుకున్నాడు. అంతేకాదు సమాజ సేవలోను శ్రీహరి ముందుండేవాడు. ప్రజలకు ఎన్నో సహాయాలు చేశాడు.   అందుకే రీల్ లైఫ్-రియల్ లైఫ్ లో రియల్ స్టార్ అనిపించుకున్నాడు. ఇప్పుడు అదే బాటలో శ్రీహరి- శాంతి దంపతుల పెద్ద కుమారుడు మేఘాంశ్ శ్రీహరి కథానాయకుడిగా పరిచయం కానున్నారు. 'రాజ్ దూత్' అనే టైటిల్ తో  యువతరం మెచ్చే రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ను తెరకెక్కించారు.


కార్తీక్- అర్జున్ దర్శకద్వయం తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తి చేసుకోగా త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్ కోసం చిత్రయూనిట్ మీడియా ముందుకు రాబోతోంది.
నటుడిగా కొనసాగినంత కాలం 'శ్రీహరి' ఛరిష్మా అసాధారణం. 'శ్రీహరి'ని ఒక హీరోగా కంటే ఒక మానవతావాదిగానే సన్నిహితులు చూసేవారు. అడిగితే ఆపదలో ఆదుకునే గొప్ప గుణం ... ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టే గొప్ప మనసున్న మారాజు శ్రీహరి అని ప్రశంసించేవారు. జర్నలిస్టులకు ఆయనంటే ప్రేమాభిమానం.. గౌరవం అంతే ఇదిగా ఉండేది. 


అందుకే శ్రీహరి వారసుడు హీరో అవుతున్నాడు అనగానే .. అతడు పెద్ద స్టార్ అవ్వాలని అంతా మనస్ఫూర్తిగా ధీవిస్తున్నారు. రియల్ స్టార్ కి మేఘాంశ్ .. శశాంక్ ఇద్దరు కొడుకులు. ఆ ఇద్దరూ ఈ రంగంలోనే కెరియర్ ని సాగిస్తారని తెలుస్తోంది. ఇక రియల్ స్టార్ శ్రీహరి రేంజులో కుమారులు రాణిస్తారా లేదా? అన్నదానికి కాలమే సమాధానం చెబుతుంది.   ఇక శ్రీహరి మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్స్ నుండి ప్రస్తుతం ఉన్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వరకూ అందరితోను నటించారు. ఇక శ్రీహరికి పేరు తెచ్చిన సినిమాల సంఖ్య అయితే లెక్కేలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: