విప్లవ సినిమాల కథానాయకుడు పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి లేటెస్ట్ మూవీ ‘మార్కెట్ లో ప్రజాస్వామ్యం’ ఆడియో ఫంక్షన్ కు చిరంజీవి అతిదిగా రావడమే కాకుండా ఆ ఫంక్షన్ లో చిరంజీవి ప్రవర్తించిన తీరు మాట్లాడిన మాటలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. 40 సంవత్సరాల నుండి తనకు నారాయణమూర్తి తెలుసు అంటూ చిరంజీవి రెండు సినిమాలలో నటిస్తే చాలు ప్రస్తుతం ఒక హీరో ఒక మంచి ఇల్లు ఒక పెద్ద కారు కొనుక్కోవాలని భావిస్తున్న పరిస్థుతులలో నారాయణమూర్తి నిరాడంబరత ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు ఆచరించలేని వాస్తవం అంటూ చిరంజీవి నారాయణ మూర్తిని  ప్రశంసించాడు.

అంతేకాదు నారాయణమూర్తి సినిమాను ప్రేమించడమే కాకుండా తాను నమ్మిన కమ్యూనిస్ట్ సిద్దాంతాల కోసం సినిమాను పెళ్లి చేసుకున్నాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు మెగా స్టార్. దక్షిణ భారత సినిమా రంగంలో కమ్యూనిస్ట్ సినిమాలు తీయడంలో నటించడంలో నారాయణమూర్తి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్న ఒక గొప్ప నటుడు అంటూ అతడి స్థానం మరెవ్వరు చేరుకోలేరు అంటూ చిరంజీవి నారాయణ మూర్తి ఫై పొగడ్తలు కురిపించాడు. 

ఇక ఈ ఫంక్షన్ లో చిరంజీవి కురిపించిన ప్రశంసలు ఒక ఎత్తు అయితే ఈ ఫంక్షన్ జరిగిన తరువాత నారాయణమూర్తి ఏర్పాటు చేసిన డిన్నర్ లో చిరంజీవి ప్రవర్తించిన తీరు మరింత ఆశ్చర్య పరిచింది. ఆ డిన్నర్ లో నారాయణమూర్తి అతి సామాన్యమైన భోజనం ఏర్పాటు చేసాడు.

సాధారణంగా చిన్నచిన్న స్వీట్ షాప్ లలో దొరికే జిలేబీతో పాటు మామూలు మంచినీళ్ళు అదేవిధంగా అతి సాధారణమైన భోజనం ఆ డిన్నర్ లో ఏర్పాటు చేసారు. అయితే చిరంజీవి మాత్రం ఆ ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయి అని తినడమే కాకుండా అతి సాధారణమైన ఆ జిలేబీని ఒకటికి రెండు సార్లు నారాయణమూర్తితో కలిసి ముక్కువగా తినడంతో స్వయం కృషితో ఎదిగిన చిరంజీవి తన మూలాలు మరిచిపోలేదు అన్న కామెంట్స్ వినిపించాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: