రాజమౌళి సినిమాలకు ఇండియాలో యమా క్రేజ్ ఏర్పడింది. ఆయన సినిమా అంటే చాలు జనాలు విపరీతంగా చూస్తారు. హీరో ఎవరు అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. అందుకే రాజమౌళి సినిమాలు స్పెషల్ గా మారాయి. ఇప్పటి వరకు రాజమౌళికి అపజయం లేకపోవడం ఇందుకు నిదర్శనం. బాహుబలి వంటి వరల్డ్ క్లాస్ మూవీని అందించిన తరువాత ఎన్టీఆర్.. రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ అన్నది వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఈ సినిమా కోసం యూనిట్ రేయింబవళ్లు కష్టపడుతున్నది. సినిమాను సూపర్బ్ గా తీర్చిదిద్దుతున్నారు రాజమౌళి. ఫస్ట్ షెడ్యూల్ తరువాత పూణే, అహ్మదాబాద్ లో షూటింగ్ జరగాల్సి ఉండగా రామ్ చరణ్ గాయం కారణంగా షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ చేతికి గాయం అయింది. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు కోలుకున్నారు.
హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షెడ్యూల్ ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లోనే అలియా భట్ కూడా పాల్గొనబోతున్నది. ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ బయటకు వచ్చింది. సినిమా టైటిల్ విషయాన్ని నెటిజన్లకు వదిలేయగా చాలామంది రెండు టైటిల్స్ ను సజెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రామ రావణ రాజ్యం, రఘుపతి రాఘవ రాజారామ్. ఈ రెండు టైటిల్స్ నుంచి కొన్ని పదాలను తీసుకొని టైటిల్ ను తయారు చేసే పనిలో ఉన్నాడు రాజమౌళి.
రామ్ చరణ్ కు జోడిగా అలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ జోడి కోసం యూనిట్ ప్రయత్నిస్తోంది. చారిత్రాత్మకమైన కథ కావడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. దాదాపు రూ.300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30 న సినిమా రిలీజ్ కాబోతున్నది.