మహర్షి గొప్ప హిట్టా అంటే దానికి సినిమా నిర్మాతల దగ్గర కూడా సరైన సమాధానం లేదు. నిర్మాతల అసంతృప్తి బయటికి క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఒకసారి హార్ట్ కి టచ్ అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు వదులుకోడు. శ్రీమంతుడు సినిమాతో టచ్ చేసాడు కొరటాల శివ. అందుకే భరత్ అనే నేను సినిమా చేసేసాడు. కొరటాలకు ఖాళీ లేదు కానీ మహేష్ రెడీనే అన్న సంగతి తెలిసిందే.


లేటెస్ట్ గా మహర్షి సినిమాతో మహేష్ మనసు గెలుచుకున్నాడు వంశీ పైడిపల్లి. ట్విట్టర్ లో ఈ సినిమాను కానీ, ఈ డైరక్టర్ ను కానీ మహేష్ మామూలుగా భుజాలకు ఎత్తుకోవడం లేదు. సినిమా కమర్షియల్ గా బయ్యర్లకు అయిదో, పదో పోతే పోతుందేమో కానీ, టోటల్ గా ఓ కేజీ ప్రాజెక్టుగా మిగిలిపోయింది. అందుకే మహేష్ మరో సినిమాను వంశీ పైడిపల్లితో చేయాలనుకున్నాడు.


ఈ మేరకు వంశీ పైడిపల్లి-మహేష్ ల నడుమ ఓ సూత్రప్రాయమైన అంగీకరం కుదిరినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. అయితే మహేష్ బాబు సుకుమార్ తో ఓ సినిమా చేయాలి. అలాగే కుదరితే త్రివిక్రమ్ తో చేయాలని వుంది. రాజమౌళి సినిమా వుండనే వుంది. పైగా వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ తయారుచేయడానికి కాస్త ఎక్కువ టైమ్ తీసుకుంటారు. అందువల్ల మహర్షి తరువాత ఒకటి కన్నా ఎక్కువ సినిమాల గ్యాపే వస్తుంది మరో సినిమాకు అని అనుకోవాల్సిందే. కానీ ఒకటి మాత్రం ఫిక్స్ మరో మహర్షి కోసం మహేష్ బాబు, వంశీపైడిపల్లి మరోసారి చేతులు కలపబోతున్నారు అన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: