టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మద్య వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు.  గత ఏడాది భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ కావడమే కాదు రూ.200 కోట్ల క్లబ్ లో చేరింది.  ఆ సినిమా విజయం మర్చిపోక ముందే వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.  ఈ మూవీ కూడా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరినట్లు వార్తలు వస్తున్నాయి.  ఇప్పుడు ఆయనతో సినిమాలు తీయడానికి పెద్ద సంస్థలే ముందుకు వస్తున్నాయి.


ప్రస్తుతం తన అభిమానులకు ఫుల్ లెన్త్ ఎంట్ర టైన్మెంట్ ఇవ్వడానికి సిద్దమవుతున్నారు మహేష్ బాబు.  ఈ నేపథ్యంలో ఎఫ్ 2 తో ఘనవిజయాన్ని అందుకున్న అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ మే 31 సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మొదలు కాబోతుంది. ప్రస్తుతం మహేష్ బాబు విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు.  ఇఖ అనీల్ రావిపూడి తర్వాత ఎవరు అన్న విషయంపై చర్చలు నడుస్తున్నాయి.


‘గీత గోవిందం’తో ఘనవిజయాన్ని సొంతం చేసుకొన్న పరశురామ్‌ ఈ మద్య మహేష్ కి ఓ కథ వినిపించడం అది బాగా నచ్చిందని చెప్పడం అన్నీ అయినట్లు సమాచారం. అన్నీ కుదిరితే అనిల్‌ రావిపూడితో సినిమా పూర్తయ్యాక, పరశురామ్‌ దర్శకత్వంలో మహేష్‌ నటించే అవకాశాలు  కనిపిస్తున్నాయి. పరశురామ్‌ తెరకెక్కించిన ‘గీత గోవిందం’ రూ.వంద కోట్లకిపైగా వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: