ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కనీసం గాజువాకలో కచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారని అందరూ అనుకున్న చివరాకరికి ప్రజాతీర్పు పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా రావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు చాలా మంది మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ ఓడిపోవడాని జీర్ణించుకోలేకపోతున్నారు.


సోషల్ మీడియాలో అయితే పవన్ కళ్యాణ్ ఓటమి ని ఆంధ్రప్రదేశ్ యువత ఓటమి తో పోల్చారు. ఈ క్రమంలో జబర్దస్త్ కామెడీ షో కమెడియన్ హైపర్ ఆది సైతం అదే తరహాలో కామెంట్ చేస్తూ షాకిచ్చాడు. మనీ, మద్యం ముందు మానవత్వం ఓడిపోయింది. ఈ రోజు ఓడిపోయింది పవన్ కల్యాణ్ కాదు.. తెలుగు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఈరోజు బ్లాక్ డే’’ అంటూ ఆది చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


హైపర్ ఆది జనసేనకు సంబందించిన ప్రచారాల్లో మీటింగ్ లలో పాల్గొని పవన్ కోసం ప్రచారం కూడా చేశాడు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు నెగిటివ్ కామెంట్స్ కౌంటర్లువేస్తూ వచ్చాడు. గాజువాక - భీమవరం స్థానాల్లో పవన్ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ ఆ స్థానాల్లో వైసిపి అభ్యర్థులు వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి, గ్రంథి శ్రీనివాస్ గెలుపొందారు.



మరింత సమాచారం తెలుసుకోండి: