తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు చరిత్రలో చూడని ఘోర పరాజయం ఎదుర్కున్న నేపధ్యంలో తెలుగుదేశం అభిమానులు విపరీతమైన నిరాశలో ఉన్నారు. ఇలాంటి పరిస్థుతులలో తిరిగి పార్టీ ఎప్పుడు జవసత్వాలు నింపుకుంటుందో ఈపార్టీ ముఖ్య నేతలకే అర్ధంకాని విషయంగా మారింది. 

ఈ నేపధ్యంలో నటుడు బ్రహ్మాజీ ఎన్నికల ఫలితాల పై విశ్లేషిస్తూ ‘ఇక మా తారక రాముడే ఆదుకోవాలి’ అంటూ చేసిన ట్విట్ వెనుక అర్ధం ఏమిటి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. జూనియర్ అభిమానులు మాత్రం ఈ ట్విట్ పై కామెంట్ చేస్తూ బ్రహ్మాజీ దృష్టిలోని తారక రాముడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అంటూ అప్పుడే కామెంట్స్ మొదలు పెట్టేసారు.

ప్రస్తుత పరిస్థితులలో తెలుగుదేశం పార్టీని ఆదుకోగల శక్తి ఒక్క జూనియర్ కు మాత్రమే ఉందనీ కొందరు తారక్ వీరాభిమానులు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. అంతేకాదు భేషజాలు పోకుండా బాలకృష్ణ జూనియర్ లు కలిసి రంగంలోకి దిగినప్పుడు మాత్రమే తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందనీ లేకుంటే చరిత్ర పేజీలలో తెలుగుదేశం మిగిలిపోతుందనీ మరికొందరు నందమూరి అభిమానులు సలహాలు ఇస్తున్నారు. 

ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కూడ పూర్తి కాకుండానే జూనియర్ అభిమానులలో మొదలైన ఈ అలజడి ఎలాంటి మలుపులకు దారి తీస్తుందో అంటూ మరికొందరు నందమూరి అభిమానులు కలవర పడుతున్నారు. అయితే ప్రస్తుతం జూనియర్ కు సినిమాలు తప్ప మరే విషయం పట్టించుకోని పరిస్థుతులలో ఉన్న నేపధ్యంలో తారక్ అతడి అభిమానులు ఇస్తున్న సలహాలను ఆలోచిస్తాడా లేదంటే లైట్ గా తీసుకుని తన సినిమా కెరియర్ మరింత వేగంగా కొనసాగిస్తాడా అన్న విషయాల పై రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీ పరిణామాలు ఆధారపడి ఉంటాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: