2019 ఏపీ ఎన్నికల ఫలితాలు ఇటీవల విడుదల అవడం జరిగాయి. జనసేన పార్టీ నుండి నరసాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన నాగబాబు దారుణంగా ఓడిపోవడం జరిగింది. మరి అదేవిధంగా జనసేన పార్టీ వ్యవస్థాపకుడు నాగబాబు తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఓడిపోవడం అందరికి షాక్ కి గురి చేసింది. అయితే జరిగిన ఎన్నికల్లో నాగబాబు విడిపోవడానికి గల కారణాలలో ఒక కారణం మా మాజీ ప్రెసిడెంట్ శివాజీరాజా అనే మాట వినబడుతోంది.


ఇండస్ట్రీ లో జరిగిన మా ఎన్నికల సందర్భంగా తనకు ప్రత్యర్థిగా నిలబడిన సీనియర్ నరేష్ రాజశేఖర్ దంపతులకు మద్దతు తెలపడంతో పాటు శివాజీరాజాను టార్గెట్ చేసి ఆయన తీరుని ఎండగట్టారు. దీనికి బదులుగా శివాజీరాజా త్వరలో రిటర్న్ గిఫ్ట్ అందుతుందని రిటార్ట్ ఇచ్చాడు. సరే ఇదంతా మాములే అని జనం లైట్ తీసుకున్నారు కట్ చేస్తే శివాజీరాజా నాగబాబు నరసాపురం నుంచి పోటీ చేయడం గురించి  ప్రచారంలో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.


పైసా ఖర్చు పెట్టని నాగబాబు మా సంఘం అభివృద్ధిని రెండేళ్ళు వెనక్కు తీసుకెళ్ళిన మనిషి ఇంత పెద్ద ఊరికి ఏదో చేస్తాడని ఎలా నమ్ముతారని కాస్త గట్టిగానే స్వరం వినిపించాడు. మరియు అదే విధంగా శివాజీరాజా పుట్టిన స్థలం కూడా అదే కావడంతో శివాజీ రాజా చేసిన కామెంట్లు నాగబాబుకి ఓటమిని తెచ్చిపెట్టాయని బాగా దెబ్బ పడింది అని చాలామంది అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: