ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఓడిపోవడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా జరిగిన ఎన్నికల్లో కేవలం ఒకే ఒక స్థానంలో పవన్ కళ్యాణ్ పార్టీ రావటం మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నరూ..ఇంత దారుణమైన ఘోరపరాజయం బట్టి జనసేన పార్టీ కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.


ఇదిలా ఉండగా బాబాయ్ పవన్ కళ్యాణ్ ఓటమిపై అబ్బాయి చరణ్ షాకింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ''గొప్ప నాయకులు నాయకత్వం కోసం కంటే మార్పు కోసమే పోరాడుతుంటారు.


అందులో పాత్ర ఏంటనేదానికంటే లక్ష్యం చాలా ముఖ్యం. పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం సేవలు అందించిన ప్రతి ఒక్కరినీ నా ధన్యవాదాలు'' అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన పవన్ అభిమానులు ఆయన గెలిచినా, గెలవకపోయినా మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి కొంతమంది అయితే ఏపీలో యువత ఓడిపోయిందని...డబ్బు మద్యం గెలిచాయి అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: