రకుల్ ప్రీతి సింగ్ ఆ మధ్య అవకాశాలు తగ్గినా ఈ మధ్య వరుస సినిమాలతో బిజీగా మారిపోతుంది.  వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా తో అందరి అభిమానాన్ని చూరగొన్న హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు లో తన మొదటి సినిమా పెద్దగా విజయం సాధించనప్పటికీ, ఆ తర్వాత చేసిన వేంకటాద్రి ఎక్సప్రెస్ మాత్రం రకుల్ కి బాగానే కలిసి వచ్చింది. ఆ తర్వాత ఇప్పటి వరకు సౌత్ లో రకుల్ వెనక్కి చూసుకున్నది లేదు.


ప్రస్తుతం తెలుగులో నాగార్జున సరసన మన్మధుడు 2 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే  దాదాపు గా అందరూ స్టార్ హీరోలతో జత కట్టిన రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా పాగా వేయాలని ఆలోచిస్తుంది. మొదటి చిత్రం తో పెద్దగా మెప్పించలేక పోయినా ఇటీవలే విడుదల అయినా దే దే ప్యార్ దే సినిమా తో మాత్రం రకుల్ ఫామ్ లో కి వచ్చింది అని చెప్పుకోవచ్చు. అజయ్ దేవగన్ సరసన మెరిసిన రకుల్ ఈ సినిమా తో మంచి పేరు ని సంపాదించుకుంది.


అజయ్ పక్కన మంచి జోడీ అని అందరి ప్రశంసలు పొందుతున్న రకుల్ ని అజయ్ దేవగన్ ఇంకో సినిమా కోసం బుక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. మరో రొమాంటిక్ కామెడీ సినిమా తో ఈ జంట ప్రేక్షకుల ముందుకు రానుందట. ఇంతకు మునుపే ఈ కొత్త చిత్రానికి సంబందించిన చర్చలు జరిగాయట. అయితే రకుల్ ప్రస్తుతం సౌత్ లో బిజీ గా ఉండటం తో తన కమిట్మెంట్స్ పూర్తి అయిన వెంటనే కొత్త చిత్రం ప్రారంభం అవుతుంది అంట.

మరింత సమాచారం తెలుసుకోండి: