మోడీ రెండవ సారి ప్రధాని అయినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ బాలీవుడ్ కు చెందిన ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తాను ఎదుర్కొంటున్న ఒక సమస్య గురించి మోడీకి తెలియజేశారు అదీ తన ట్విట్టర్ ద్వారా. రీసెంట్‌గా పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకొని నరేంద్ర మోడీ రెండవ సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్దం అవుతున్న సమయంలో ఇలాంటి సమస్య తలెత్తడం అందరిని అయోమయానికి గురి చేస్తోంది.


అనురాగ్ కశ్యప్ ట్విట్టర్ లో... డియర్ నరేంద్ర మోడీ సర్.. మీ విజయానికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో మీకో విషయంను చెప్పాలనుకుంటున్నాను. 'చౌకీదార్' అని పెట్టుకుని మీ ఫాలోవర్స్ అంటూ చెప్పుకుంటున్న ఒక వ్యక్తి నా కూతురును రేప్ చేస్తానంటూ బెదిరించాడు. అంటూ ఒక ట్వీట్ ను తన ట్వీట్ తో పాటు పోస్ట్ చేశాడు. 
ఆ వ్యక్తి ట్విట్టర్ లో అనురాగ్ కశ్యప్ కూతురును ఉద్దేశించి ట్వీట్ చేయడం జరిగింది. అందులో మీ నాన్నకు చెప్పు మరోసారి మోడీని విమర్శించినా - వ్యతిరేకంగా మాట్లాడినా కూడా నిన్ను రేప్ చేస్తాం. ఈ ట్వీట్ తో ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు.

ఈ విషయాన్ని అందరికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో మోడీని ట్యాగ్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఈ విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా అనురాగ్ కశ్యప్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ ట్వీట్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ ట్వీట్ చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ నెటిజన్స్ కోరుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: