ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ చరిత్రను తిరగరాసే విధంగా విజయం సాధించారు. జగన్ గెలవడంతో చాలామంది వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులతో పాటు జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు కూడా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. మరోపక్క సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా జగన్ విజయం సాధించడం పట్ల తమ ఆనందాన్ని అభినందనలను సోషల్ మీడియాలో తెలియచేస్తున్నారు. తాజాగా సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ట్విటర్‌ లో అభినందనలు తెలిపారు.


జగన్‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా ప్రధాని మోడీ సైతం ఆయన అభినందనలు తెలియచేసారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న వైఎస్‌ జగన్‌కు అభినందనలు. మీ పాలనలో రాష్ట్రం అత్యున్నత శిఖరాలు అందుకోవాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని మనసార ఆకాంక్షిస్తున్నాను’ అని మహేశ్‌బాబు ట్వీట్‌ చేశారు.


ఇక గురువారం వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లతో ప్రభంజనం సృష్టించింది. అంతేకాకుండా రాజకీయాల్లో వైయస్ ఫ్యామిలీకి ముందుండి సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబం అతి దగ్గరగా ఉండే కుటుంబం. దీంతో రాజకీయాలకు దూరంగా ఉండే మహేష్...జగన్ విజయం సాధించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించింది అంటూ సన్నిహితులతో అన్నారట. మరోపక్క వైసీపీ పార్టీ విజయాన్ని తమ విజయంగా భావిస్తున్నారు మహేష్ అభిమానులు.



మరింత సమాచారం తెలుసుకోండి: