పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాలలోనూ పరాజయం చెందడంతో తీవ్ర నిరాశలో ఉన్న పవన్ వీరాభిమానులకు ధైర్యాన్ని నింపుతూ చరణ్ చేసిన ట్విట్ ఇప్పుడు వైరల్ గా మారింది.  ‘‘ఒక గొప్ప నాయుకడు ఎప్పుడూ తాను లీడర్‌గా కీర్తి పొందాలని ఆరాట పడరు, ఆయన లక్ష్యం తాను అనుకున్న విధంగా సమాజంలో మార్పు తేవడమే. అలా ప్రయత్నిస్తూ ముందుకు సాగే వాడే నిజమైన నాయుడు'' అంటూ రామ్ చరణ్ చేసిన ట్విట్ మెగా అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది.

 ఈ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియచేసిన రామ్ చరణ్ రాజకీయాలలో పదవులు ముఖ్యం కాదు లక్ష్యం మాత్రమే ముఖ్యం అంటూ మనం చేస్తున్న పని లక్ష్యం మంచిది అయితే అది ఎదో ఒకరోజున ఫలితం ఇస్తుంది అంటూ చరణ్ మెగా అభిమానులకు ధైర్యం చెప్పాడు. ప్రస్తుతం చరణ్ చేసిన ట్విట్ పై వేలాది సంఖ్యలో మెగా అభిమానులు స్పందిస్తున్నారు.

‘జనసేన’ జెండానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ ను చచ్చేదాకా వదిలేది లేదు అంటూ పవన్ వీరాభిమానులు చరణ్ ట్విట్ కు సంఘీభావం తెలియచేస్తున్నారు. చరణ్ భార్య ఉపాసన కూడ చరణ్ ట్విట్ కు లైక్ కొట్టి తన మద్దతు తెలపడంతో మెగా ఫ్యామిలీ అంతా పవన్ వెంట ఉంది అన్న సంకేతాలు మరొక సారి తెలియచేస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే ఘోర ఓటమి పరాభవం నుండి వెంటనే తేరుకున్న పవన్ కళ్యాణ్ నిన్నటి నుండి జనసేనకు సంబంధించిన ముఖ్య నేతలతో వరసపెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నాడు. అంతేకాదు వచ్చే నెల మొదటివారంలో జనసేన కార్యకర్తలతో ఒక కీలక సమావేశాన్ని నిర్వహించి వారికి ధైర్యం చెప్పే ఒక భారీ కార్యక్రమానికి కూడ పవన్ ఆలోచనలు చేస్తూ తన ఓటమి తన లక్ష్యాన్ని ఏమాత్రం ప్రభావితం చేయదు అన్న సంకేతాలు ఇవ్వబోతున్నాడు..  


మరింత సమాచారం తెలుసుకోండి: