మొన్న ఏపిలో వెలువడ్డ ఫలితాల్లో టీడీపీ గతమెన్నడూ చూడని విధంగా దారుణమైన పరాజయం పొందింది.  40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 46 ఏళ్ల వయసు ఉన్న వైఎస్ జగన్ మోహన్ ముందు చతికిల పడ్డారు.  రిజల్ట్ వచ్చే ముందు రోజు కూడా గెలుపు మాదే అని మేకపోతు గాంభీర్యం తో ఉన్న చంద్రబాబు..ఎన్నికల ఫలితాలు రాగానే మైండ్ బ్లాక్ అయ్యింది.  అసలే దారుణమైన ఓటమితో ఉన్న టీడీపీ శ్రేణులపై ఈ రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్స్, కార్టూన్లు..విమర్శలు వస్తున్నాయి. 


 వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ బాబును టార్గెట్ చేసుకొని తన ట్విట్టర్ లో ఓ ఆట ఆడుకుంటున్నారు. తాను తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో విడుదలకు నోచుకోలేదు.  మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అడ్డంకులు సృష్టిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. కోర్టు కేసుల నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ఏపీలో విడుదల కాలేదు.

ఎన్నికల అనంతరం ఈ సినిమా విడుదల చేయాలనీ ప్రయత్నించినా కుదర్లేదు. ఆ మద్య వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. కానీ వర్మని అడ్డుకున్న పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు..అంతే కాదు వర్మను అరెస్ట్ కూడా చేశారు. 
ఈ నేపథ్యంలో తాను మరోమారు విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించబోతున్నానని ప్రకటించారు.

ఎక్కడైతే మాజీ సీఎం నన్ను అరెస్ట్ చేయించి విజయవాడ నుంచి వెళ్ళగొట్టారో అదే పైపుల రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆదివారం సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించబోతున్నా.. బస్తీమే సవాల్.. ఎన్టీఆర్ నిజమైన అభిమానులకు ఇదే నా ఆహ్వానం.. జైజగన్.. అని ట్వీట్ చేశాడు. మొత్తానికి ఎవరు వదిలినా..వర్మ మాత్రం వదల బొమ్మాళీ వదలా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: