ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ప్రభాస్ తో ఒక చరిత్రాత్మకమైన కథతో సినిమా తీయాలని తన జీవిత కాల అని చాలా సందర్భాలలో పేర్కొనడం జరిగింది. అయితే ఈ సినిమా గురించి ప్రభాస్ తో కృష్ణంరాజు చాలా సార్లు చర్చించిన చేద్దాం కానీ ఇప్పుడే సమయం లేదు అని అప్పట్లో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేవాడు ప్రభాస్. అయితే తాజాగా నీ చరిత్రాత్మకమైన సినిమా గురించి మరొకసారి కృష్ణంరాజు తన కొడుకు ప్రభాస్ తో చర్చించి ఏ డెసిషన్ చెప్పమన్నారట.


ప్రభాస్ మీరు మిగతా పనులు మొదలెట్టండి చేసేద్దాం అన్నారట. ఈ చిత్రం కథ స‌మాజాన్ని చైత‌న్య ప‌రిచే క‌థ అని…ఒక్క అడుగు వెయి అడుగులకు నాంది పల‌కాల‌న్న ఓ మంచి కానెప్ట్ తో రాసుకున్న‌ట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఓకే అనటంతో  స‌రైన ద‌ర్శ‌కుడి కోసం అన్వేషణ మొదలెట్టారట. సొంత బ్యాన‌ర్లోనే ఆ చిత్రాన్ని నిర్మించాల‌ని చూస్తున్నారు. ఓ స్టార్ డైరెక్ట‌ర్ ని ఈ సినిమా కోసం లాక్ చేసి పెట్టారుట‌. ఇప్ప‌టికే బాగా ఆల‌స్య‌మైన నేప‌థ్యంలో లేటు చేయ‌కూడ‌ద‌ని వీలైంత‌న త్వ‌ర‌గా సెట్స్ కు వెళ్లాల‌ని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఆగస్టు 15వ తారీఖున ఈ సినిమా విడుదల కానుంది. అయితే మరో పక్క తన పెద నాన్న కృష్ణంరాజు తీయబోయే సినిమా కోసం..తాను చెయ్యాలి అని అనుకుంటున్నా రెండు సినిమాలను పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారట ప్రభాస్. మొత్తం మీద తన పెదనాన్న కోరిక తీర్చడం కోసం ప్రభాస్ సంచలన నిర్ణయమే తీసుకున్నారు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు.





మరింత సమాచారం తెలుసుకోండి: