సౌత్ లో టాలీవుడ్, బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించి అభిమానుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది తిషా. కోలీవుడ్‌లో సుమారు 15 సంవత్సరాల నుంచి కథానాయకిగా రాణిస్తున్నా నటి త్రిష కొంతకాలం గ్యాప్‌ తరువాత హీరోయిన్‌ ఓరియెంటెండ్‌ చిత్రాలను ఎంచుకుని నటిస్తోంది. ఆమె నటించిన నాయిక, మోహిని చిత్రాలు  బాక్సాఫీస్‌ వద్ద పరాజయం చెందాయి. ఆ తర్వాత అంతగా పెద్ద ఆఫర్లు ఆమె వద్దకు రాలేదు. ఈ నేపథ్యంలో విజయ్‌ సేదుపతితో ఆమె నటించిన ‘96’ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 


ప్రస్తుతం ఆమె హీరోయిన్‌ ఓరియెంటెండ్‌ చిత్రాల్లో నటించేందుకు ఆశక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలో ఏఆర్‌ మురుగదాస్‌ అందించిన కథ ‘రాంగీ’ చిత్రంలో త్రిష హీరోయిన్‌ ఓరియెంటెండ్‌ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి మురుగదాస్‌ శిష్యుడు శరవణన్‌ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ చెన్నైలో శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం త్రిష ‘రాంగీ’ చిత్ర షూటింగ్‌లో రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆమె వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


ఫారిన్‌లో చెన్నై సుందరి త్రిష అరెస్ట్‌ అయ్యారు. ఆమె ఫ్యాన్స్‌ అందరూ కంగారు పడాల్సిందేమీ లేదు. ఇది కేవలం ‘రాంగీ’ చిత్రంలోని ఓ సీన్‌ మాత్రమే. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు చిత్రబృందం. థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మరి.. పోస్టర్‌లో త్రిష చేతికి బేడీలు వేసి ఉన్నాయి. దానికి గల కారణం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఇటీవలే చెన్నైలో తొలి షెడ్యూల్‌ను కంప్లీట్‌ చేసిన చిత్రబృందం ప్రస్తుతం ఉబ్జెకిస్తాన్‌లో షూటింగ్‌ జరుపుతున్నారు. ఈ సినిమాలో త్రిష కొన్ని రియల్‌ స్టంట్స్‌ కూడా చేస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: