ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల ప్రాంతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2003లో చేసిన పాద యాత్రను ఆధారంగా చేసుకుని తీసిన ‘యాత్ర’ మూవీ కలక్షన్స్ పరంగా సునామీ సృష్టించక పోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీలో మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటనకు విపరీతమైన ప్రశంసలు కూడ వచ్చాయి.

‘ఆనందో బ్రహ్మ’ మూవీ ద్వారా ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ డైరెక్టర్ దృష్టి ఇప్పుడు జగన్ సృష్టించిన సునామీ పై పడినట్లుగా సంకేతాలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు 'యాత్ర' సీక్వెల్ కు బీజం పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఈవిషయాన్ని స్వయంగా దర్శకుడు మహీ వీ రాఘవ్ తన ట్విటర్ ద్వారా వెల్లడి చేసాడు. జగన్ అఖండ విజయం సాధించిన తరువాత ఆయనను అభినందించదానికి వ్యక్తిగతంగా కలిసి తన అభినందనలు తెలపడమే కాకుండా వైయస్ జగన్ తో కలిసి ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేసిన మహి.. "@YSR Party. వైయస్ జగన్ అన్నా.. ఇది నిజంగా మీకు తగిన విజయం.  మీరు ప్రజలకు హామీ ఇచ్చినట్టుగా వైయస్ రాజశేఖరరెడ్డిగారి కంటే ఎక్కువగా ప్రజల ఆకాంక్షలు నేరవేరుస్తారని ఆశిస్తున్నా.  నేను చెప్పాల్సిన ఒక కథను మీరు రాశారు.. #యాత్ర 2 @శివమేక" అంటూ ట్వీట్ చేసి ‘యాత్ర’ సీక్వెల్ కు శ్రీకారం చుట్టారు. 

ప్రస్తుతం ఎక్కడ చూసినా మరి ఎక్కడ విన్నా జగన్ వార్తలు మాత్రమే కనిపిస్తున్న పరిస్థుతులలో ‘యాత్ర 2’ సీక్వెల్ ను వీలైనంత త్వరలో పూర్తి చేసి విడుదల చేయాలి అన్న ఉద్దేశ్యంలో ఈ యంగ్ డైరెక్టర్ ఉన్నట్లు సమాచారం. జగన్ ప్రజలతో మమైకం అవుతూ చేసిన పాదయాత్ర నేపధ్యంలో ఈ ‘మాత్ర 2’ ఉంటుంది అని సమాచారం. అయితే జగన్ పాత్రను పోషించ దగ్గ నటుడుకోసం ప్రస్తుతం రాఘవ్ అన్వేషణ చేస్తున్నట్లు టాక్..    


మరింత సమాచారం తెలుసుకోండి: