శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ డైరక్షన్ లో వస్తున్న సినిమాకు టైటిల్ గా రణరంగం ఫిక్స్ చేశారు. సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు. శర్వానంద్ డ్యుయల్ రోల్ చేస్తున్న ఈ సినిమా టీజర్ చూస్తే ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్ గా అనిపిస్తుంది. తన ఫాలోవర్స్, సపోర్టర్స్ తో నడుచుకుంటూ వస్తున్న శర్వానంద్ టీజర్ లో కనిపించాడు. 


అయితే ఈ ఫస్ట్ లుక్ టీజర్ చూస్తే కచ్చితంగా శర్వానంద్ నటించిన ప్రస్థానం సినిమా గుర్తుకొస్తుంది. రణరంగం సినిమాలో శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రశాంత్ పిల్లై మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తో పాటే రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశారు చిత్రయూనిట్.


స్వామిరారా సినిమాతో సత్తా చాటిన సుధీర్ వర్మ మధ్యలో కొన్ని సినిమాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అందుకే కాస్త టైం తీసుకుని శర్వానంద్ తో రణరంగం తీశాడు. ఈ సినిమాపై సుధీర్ వర్మ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు.


మొత్తానికి శర్వానంద్ రణరంగం టీజర్ ఇంప్రెస్ చేసింది. శర్వానంద్ 27వ సినిమాగా వస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా సరే హిట్ కొట్టాలని చూస్తున్నాడు. కాజల్, కళ్యాణి ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. ఆగష్టు 2న వస్తున్న శర్వా రణరంగం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: