శేఖర్ కమ్ముల తీసిన ఫిదా తర్వాత సాయి పల్లవి అటు టాలీవుడ్ ఇటు కోలీవుడ్ లో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాదు  సాయి పల్లవి అందంతో పాటు ప్రతిభ ఉన్న నటిగా గుర్తింపు దక్కించుకుంది. తెలుగు.. తమిళం.. మలయాళంలో స్టార్ హీరోయిన్ గా దూసుకు పోతుంది. రీసెంట్‌గా సాయి పల్లవి తమిళంలో సూర్యతో కలిసి 'ఎన్జీకే' సినిమాలో నటించింది. ఆ సినిమాను మే 31న తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. 


ఇక దర్శకుడు సెల్వ రాఘవన్ సీన్స్ క్వాలిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడని ఆయన ఏ సీన్ ను అంత త్వరగా కాంప్రమైజ్ అవడంటూ అన్న విషయం అందరికి తెలిసిందే. 'ఎన్జీకే' సినిమా షూటింగ్ సమయంలో ఒక సీన్ కోసం సాయి పల్లవి చాలా ఇబ్బంది పడిందట. డైరెక్టర్ పదే పదే రీ షూట్ అనడంతో సాయి పల్లవి కన్నీరు పెట్టుకుందట. ఆ రోజుకు షాట్ సరిగా రాకపోవడంతో తర్వాత రోజు చేద్దామని ఆ రోజుకు దర్శకుడు పేకప్ చెప్పాడట. 


సెల్వ అనుకున్నది వచ్చే వరకు అసలు కాంప్రమైజ్ కాడని ఆ తర్వాత రోజు వెంటనే ఆ షాట్ ను పెర్ఫెక్ట్‌గా కంప్లీట్ చేసిందట సాయి పల్లవి. ఇక ఈ విషయాన్ని సూర్య తో చెప్పగా  సెల్వ నా షాట్స్ ను కూడా మళ్లీ మళ్లీ రీ షూట్ చేస్తాడు.. ఎప్పుడు కూడా ఒక్క టేక్ కు ఓకే చెప్పడని సూర్య చెప్పడంతో సాయి పల్లవి రిలాక్స్ అయిందట. ఇక ఎన్జీకే సినిమాలో సూర్యకు భార్యగా సాయి పల్లవి కనిపించబోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: