క్లాసిక్ సినిమాలతో స్టార డం ని సంపాదించుకున్న హీరో అమర్ నాథ్ కుమారుడు హీరో రాజేష్ కూతురు ఐశ్వర్యా రాజేష్. తమిళ సినిమాలలో టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ఐశ్వర్యా 'కౌశల్య కృష్ణమూర్తి' సినిమా తో తెలుగు తెరకు పరిచయం అవుతోంది. టాలీవుడ్ కి ఓ మంచి పెర్ఫామర్ పరిచయం అవుతోందని అయితే తనకు ఉన్న సినీ నేపథ్యం గురించి తెలుగు వారికి తెలియదని ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు అనడం విశేషం. 


ఇక తమిళంలో 23 సినిమాలు నటించి బెస్ట్ పొజిషన్ లో ఉన్న ఐశ్వర్యా పాత్ర కోసం ప్రాణం పెట్టేస్తుందని ... సావిత్రి  తర్వాత అంతటి గొప్ప నటి అని కూడా కితాబిచ్చేశారు దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు. సావిత్రికి ఒక కంటి నుంచి మాత్రమే కన్నీళ్లు జారాలని ఆ కాలంలోనే కె.వి.రెడ్డి అంతటి గొప్ప దర్శకుడు కండిషన్ పెట్టారు. ఆయన అడిగినట్టే నటించి చూపించింది. నేటి తరంలో ఆ స్థాయి నటన కనబరిచే గొప్ప పెర్ఫామర్ ఐశ్వర్యా రాజేష్ అంటూ పొగడ్తలతో తెగ ముంచేస్తున్నారు భీమనేని శ్రీనివాసరావు. దీన్నీ బట్టి చూస్తుంటే ఐశ్వర్యా టాలీవుడ్ ని ఏలబోతోందని అనిపిస్తుంది.


అయితే ఐశ్వర్య నిజంగా ఎంత గొప్ప పెర్ఫామరో తెలియాలంటే త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న `కౌశల్య కృష్ణమూర్తి` చూడాల్సిందే. టాప్ హీరోయిన్ గా ఎదిగేస్తుందంటూ కితాబునిస్తున్నారంటే ఐశ్వర్యాలో అంత మ్యాటర్ ఏం ఉందో చూడాలి. ఇక ఐశ్వర్యా తండ్రి గారు రాజేష్ దాదాపు 54 సినిమాల్లో నటించారు. ఐశ్వర్య ఆంటీ శ్రీలక్ష్మి తెలుగులో కమెడియన్ గా 500 పైగా సినిమాల్లో నటించింది. కీర్తి సురేష్ తరహాలోనే పక్కాగా సినీ నేపథ్యం ఉన్న ఈ అమ్మడు కీర్తి అంత పెద్ద స్థాయికి ఎదుగుతుందా లేదా? అన్నది చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: