టాలీవుడ్ ఇండస్ట్రీలో RX100 సినిమాలు లో నటించి తెలుగు కుర్ర హృదయాలను దోచుకున్న ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. మొట్టమొదటి సినిమాతోనే ఎవరు ఊహించని విధంగా పాయల్ రాజ్ పుత్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో తనకి వచ్చిన క్రేజ్ ఎక్కడా తగ్గకుండా చూసుకుంటోంది.


ఇక ఎలా పడితే అలా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా అలోచించి అడుగువేస్తోంది. ఇటీవల బేబీ వేశ్య పాత్రకు ఒప్పుకున్నట్లు చెప్పింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వర్ రావు(1970 - 80 కాలానికి చెందిన వ్యక్తి) జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో పాయల్ నటిస్తోంది.


నిది అగర్వాల్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ బయోపిక్ లో వేశ్య పాత్ర కోసం చాలా మందిని అనుకున్నప్పటికీ చివరికి పాయల్ రాజ్ పుత్ ని సెలెక్ట్ చేసుకున్నారు. దొంగాట - కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వంశీ కృష్ణ ఈ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: