‘ముని’ సినిమాతో హర్రర్ తో పాటు కామెడీ ఎంట్రటైన్ మెంట్ తో తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసు దోచాడు ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నటుడు లారెన్స్ రాఘవేంద్ర.  ఈ సినిమా భారీగా వసూళ్లు చేయడంతో ఇదే కాన్సెప్ట్ తో వరుసగా సీక్వెల్ తీయడం మొదలు పెట్టారు.  కాంచన, గంగ, కాంచన 3 సినిమాలతో అలరించారు లారెన్స్.  కాంచన సినిమా కన్నడలో రీమేక్ చేశారు..ఆ మద్య బాలీవుడ్ లో కూడా రాబోతుందని వార్తలు వచ్చాయి..కానీ అది సెట్స్ పైకి వెళ్లలేదు. 

ఈ మద్య టాలీవుడ్ లో వస్తున్న చాలా వరకు సినిమాలు బాలీవుడ్ లో రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఒక రకంగా చెప్పాలంటే..బాలీవుడ్ లో వస్తున్న సినిమాలు భారీ స్థాయిలో కలెక్షన్లు వసూళ్లు చేస్తూ సౌత్ సినిమాను సవాళ్లు విసురుతున్నాయి. ఈ మద్య లారెన్స్ కి బాలీవుడ్ లో ఘోరంగా అవమానం జరిగిన విషయం తెలిసిందే.  అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ డైరెక్షన్ లో కాంచన కథను లక్ష్మి బాంబ్ గా తెరకెక్కిస్తున్నారు. 


అయితే చిత్ర యూనిట్, లారెన్స్ అనుమతి లేకుండా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడమే కాకుండా సరైన గౌరవం ఇవ్వకపోవడంతో లారెన్స్ సినిమా చేయనని తప్పుకున్నాడు. ఈ కథకు సరైన దర్శకుడు లారెన్స్ అంటూ లారెన్స్ పై కూడా ఒత్తిడి పెంచారు. 


ఈ నేపథ్యంలో లారెన్స్ తన క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. మూవీ నిర్మాతలతో మీటింగ్ ఉందని వారు మాట్లాడే విధానాన్ని బట్టి నా నిర్ణయం ఉంటుందని అన్నారు. అదే విధంగా నేను గౌరవం ఇవ్వలేని చోట పని చేయలేను అని చెబుతూ.. అభిమానులు నన్ను సినిమాకు దర్శకత్వం వహించమని అడుగుతున్నారు.  మరి లారెన్స్ ఈ సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: