ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే.  ఎవరి ఊహలకు అందని విధంగా భారీ విజయంతో దుమ్మురేపింది.  175 సీట్లకు 150 సీట్లు సాధించింది. ఈ నేపథ్యంలో జగన్ కి అన్ని వర్గాల వారు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  తాజాగా సినీ నటుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫృథ్వి మాట్లాడుతూ..ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టిన రోజే జగన్ విజయం సాధించారన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ ఆశయ సాధన కోసం ‘ప్రజా సంకల్పయాత్ర’ మొదలు పెట్టి గడప గడపకు తిరిగి నేనున్నానని భరోసా ఇచ్చాడు. 


ఇప్పటి వరకు ఎంతో మంది నాయకులు ప్రెస్ మీట్లు..వేధికలపైనే మాట్లాడారు..కానీ జగన్ మాత్రం ప్రజల వద్దకు వచ్చి వారి కష్టసుఖాలను స్వయంగా చూసి ఛలించిపోయారు..వారి కష్టాన్ని తీరుస్తానని హామీ ఇచ్చారు.  స్వయంగా రాజన్నే తమ వద్దకు మరోసారి వచ్చారిన ఏపి ప్రజలు నమ్మారు..అందుకే జగన్ కి అఖండ విజయం అందించారు.   


టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఇచ్చిన తీర్పునే.. మళ్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్‌కు ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మరో నటుడు కృష్ణుడు మాట్లాడుతూ జగన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి తామంతా విజయవాడ వెళుతున్నామని తెలిపారు. సంగీత దర్శకుడు ఆదిత్య రూపొందించిన ఓ పాటను బెజవాడలో ఆవిష్కరిస్తామని కృష్ణుడు వెల్లడించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: