రాజకీయాలకు,సినిమాలకు చాలా దగ్గర సంబంధం ఉంది.అందుకే అటు వాళ్ళు ఇటు.ఇటు వాళ్ళు అటు వెళ్తుంటారు.అలాగే ఒకరి విజయాలకు మరక్కొరు శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు.అలాగే 2019 లో జరిగిన ఎన్నికలలో లాండ్ స్లయిడింగ్ విజయాన్ని అందుకున్న జగన్ కు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.


వారిలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఉన్నారు.ప్రతి చిన్న విషయాన్ని పోస్టులు వేసి హడావిడి చేసే   సోషల్ మీడియా ఇప్పుడు పూరి జగన్నాథ్ జగన్ కు శుభాకాంక్షలు తెల్పడం పై ఫోకస్ చేసి అసలు విషయాలని పోస్ట్ లు చేస్తున్నారు.


అసలు విషయం ఏమిటంటే పూరి తమ్ముడు ఉమా శంకర్ వైసీపీ ఎమ్మెల్యేగా నర్సీపట్నం నుండి గెలుపొందారు.పూరి తన తమ్ముడి తో పాటు గెలిచి సీఎం అవుతున్నా జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు.ఇండస్ట్రీలో పూరిని అందరూ జగన్ అని పిలుస్తూ ఉంటారు.దానితో సినీ జగన్ సీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు అని పోస్టులలో హడావిడి మొదలుపెట్టేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: