కోలీవుడ్ హీరో సూర్య, సెల్వ రాఘవన్ డైరక్షన్ లో వస్తున్న క్రేజీ మూవీ ఎన్.జి.కే సామాన్యుడైన ఓ కుర్రాడు రాజకీయాల్లోకి వచ్చి వ్యవస్థలో ఎలాంటి మార్పులు తెచ్చాడు అన్నది సినిమా కథ. సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటించారు. మే 31న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే సంచలనం సృష్టించింది.


తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్న ఈ సినిమాకు ఇక్కడ హంగామా తక్కువగానే కనిపిస్తుంది. జస్ట్ మే 28న తెలుగులో ఓ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సినిమా ప్రమోషన్స్ మొదలు పెడతారట. కోలీవుడ్ లో మాత్రం సూర్య రేంజ్ ను మించి భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారట. అంతేకాదు ఈ సినిమా మొదటిసారిగా సౌత్ కొరియాలో రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.


అక్కడ రిలీజ్ అవుతున్న మొదటి తమిళ సినిమాగా ఎన్.జి.కే రికార్డ్ సృష్టిస్తుంది. సూర్య అండ్ టీం సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది. సాయి పల్లవి సూర్య భార్య పాత్రలో నటిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం పొలిటికల్ సపోర్టర్ గా కనిపిస్తుంది. సందేశాన్ని ఇస్తూనే మాస్ అండ్ కమర్షియల్ అంశాలు కలిగిన సినిమాగా ఎన్.జి.కే వస్తుంది.


తెలుగులో సూర్యకు మంచి ఫాలోయింగ్ ఉన్నా ఈమధ్య ఆయన సినిమాలేవి ఇక్కడ పెద్దగా వర్క్ అవుట్ అవ్వట్లేదు. అయినా సరే ఎన్.జి.కే సినిమా నిర్మాత రాధామోహన్ 8 కోట్లకు కొన్నారట. ఉన్నంతలో భారీగానే రిలీజ్ చేస్తున్నారని తెలుతుంది. కొద్దిగా తెలుగులో కూడా ప్రమోషన్స్ చేస్తే బెటర్ అని సూర్య ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.    


`

మరింత సమాచారం తెలుసుకోండి: