కమ్మ రాజ్యం తాజా ఎన్నికల్లో ఈ పదం కొన్ని సార్లు దొర్లింది. అసలు అయిదేళ్ళ టీడీపీ జమానాలో ఈ పదం గురించే  చాలా చర్చ సాగింది. ఏపీలో కుల రాజకీయం ఏర్పాటు చేశారని విపక్షాలు గట్టిగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మరి అది కూడా జనంలో వెళ్ళడం వల్ల ఈసారి టీడీపీ ఘోరంగా దెబ్బతింది. 


మరి ఇదిపుడు పొలిటికల్ మూవీకి ఓ కధా వస్తువు అయింది దాన్ని సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ  డేరింగ్ మూవీగా జనం ముందుకు తెస్తున్నాడు. అంటే ఇపుడు అధికారంలో ఉన్నది జగన్. ఆయన కడప రెడ్డి. మరి నిన్నటి వరకూ సాగింది కమ్మ రాజ్యం. ఇలా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ వర్మ మూవీ తీస్తున్నారా అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి.


ఈ మూవీని వైసీపీ నేత రాకేష్ రెడ్డి నిర్మాతగా తీస్తున్నాడుట. విజయవాడ, అమరావతిలలో  ఈ మూవీ షూటింగ్ తొందరలోనే జరుపుకుంటుందని వర్మ చెబుతున్నాడు. అంటే ఓడిపోయినా కూడా  చంద్రబాబుని వర్మ వదలడని తేలిపోయింది. ఇక లక్ష్మిస్  ఎంటీయార్ మూవీని కూడా ఈ నెల 31న ఏపీ జనాల ముందుకు తెస్తున్న వర్మ కొత్త మూవీ కమ్మ రాజ్యం రిలీజ్  ఎపుడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: