డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎప్పుడు కాంట్రవర్సీలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇటీవల లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలకు చుక్కలు చూపించిన రాంగోపాల్ వర్మ తాజాగా మరో కాంట్రవర్సీ సినిమా చేయడానికి పూనుకున్నారు. ఎక్కువగా పొలిటికల్ టచ్ కలిగిన అంశాలను టచ్ చేస్తూ టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.


ఇక విషయంలోకి వస్తే ఇటీవల సోషల్ మీడియాలో ఆర్జివి..నా నెక్స్ట్ సినిమా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని వర్మ స్ట్రాంగ్ గానే  చెప్పేశాడు.అయితే ఆ టైటిల్ తో సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు క్లారిటీ రాదూ. వర్మ గతంలో చేస్తానని చేయకుండా వదిలేసిన సినిమాల సంఖ్య 50కి పైగానే ఉంటాయి.


ఇక ఇప్పుడు విజయవాడకు రాగానే ఒక కొత్త ఐడియా వచ్చిందని అదే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని వివరణ ఇస్తూ ఇప్పుడు కథను సెట్ చేసుకుంటాను అని చెప్పారు. మరియు అదే విధంగా ఈ నెల 31వ తారీఖున ఏపీలో విడుదల కాబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చాలావరకు వెన్నుపోటు ఎలా ఉంటుందో అది రామారావు గారికి ఏ విధంగా పని చేసిందో క్లియర్ కట్ గా సినిమాలో చూపించానని అసలైన వెన్నుపోటు అంటే అదేనండి అంటూ రాంగోపాల్ వర్మ ఇటీవల విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో షాకింగ్ కామెంట్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: