దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’ . ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ మొదటిలో బాగా శరవేగంగా సాగిన మధ్యలో ఎన్టీఆర్ చరణ్ లకు చేస్తున్న షూటింగులో తీవ్ర గాయాలు కావడంతో ఈ సినిమా షూటింగ్ ను కొద్దిరోజులుగా ఆపివేయడం జరిగింది.
అయితే తాజాగా వీరిద్దరు గాయాల నుండి కోలుకోవడంతో ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. తాజాగా స్టార్ట్ చేసినా షెడ్యూల్లో..హైదరాబాద్ నగర శివార్లలో వేసిన సెట్లో కొమరం భీమ్(తారక్), అల్లూరి సీతారామరాజు(చరణ్) బ్రిటిషర్స్ను ఎదిరించే పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. దాదాపు నెల రోజులకు పైగా సాగే ఈ షెడ్యూల్లో కథానాయిక అలియా భట్ కూడా జాయిన్ కానుందని తెలుస్తోంది.
నిత్య మీనన్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఆర్ ఆర్ ఆర్కి స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్నాడు. డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ని… 2020, జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.