టాప్ హీరోలపై ఉండే అభిమానంతో చాలామంది అభిమానులు తమ వ్యక్తిగత జీవితాల గురించి కూడ లెక్క చేయకుండా నష్టపోతూ ఉంటారు. ఇలాంటి సందర్భానికి సంబంధించిన మహేష్ వీరాభిమాని శ్రీరామ్ తేజ్ కు సంబంధించిన ఒక ముఖ్య విషయం ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇతడు తూర్పు గోదావరి ప్రాంతానికి చెందిన వీరాభిమాని. సోషల్ మీడియాలో ఒక పేజీని గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఇతడి పేజీకి ప్రొఫైల్ పిక్ గా మహేష్ బాబు ఫోటోను పెట్టుకుని మహేష్ సినిమాలకు సంబంధించిన వార్తలు అన్నింటిని మహేష్ అభిమానులకు షేర్ చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా మహేష్ పై తన వీరాభిమానాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. 

అంతేకాదు ఈ సోషల్ మీడియా అకౌంట్ లో మహేష్ వార్తలతో పాటు ఎక్కువగా బ్లడ్ డొనేషన్ గురించి పలానా వారికి పలానా గ్రూప్ బ్లడ్ కావాలి అంటూ మహేష్ వీరాభిమానిగా సమాజ సేవ కూడ చేసాడు. ఇలా మహేష్ పై విపరీతమైన అభిమానం ఉన్న శ్రీరామ్ గత 13 సంవత్సరాలుగా మృత్యువుతో పోరాడుతున్నాడు అన్న విషయం చాలామందికి తెలియదు. 

అయితే ఈమధ్య ఆ వీరాభిమాని చనిపోయినట్లు తెలుస్తోంది. శ్రీరామ్ ప్రియమిత్రుడు సోషల్ మీడియాలో ఈవార్తను షేర్ చేస్తూ శ్రీరామ్ గత కొన్ని సంవత్సరాలుగా కాలేయ సంబంధిత వ్యాధితో పోరాడుతూ ఆ వ్యాధిని నయంచేసుకునే శక్తి లేకపోయినా మృత్యువుతో పోరాడుతూ చివరి నిముషం వరకు మహేష్ వార్తలను ప్రమోట్ చేయడంలో ఇతడు కనపరిచిన విపరీతమైన అభిమానాన్ని వివరంగా వివరించాడు. ఇలాంటి వీరాభిమాని చనిపోతే కనీసం మహేష్ అభిమానులు కూడ ఆవిషయాన్ని పెద్దగ పట్టించుకోలేదనీ అదేవిధంగా ఎన్నో విషయాల పై స్పందించే మహేష్ తన వీరాభిమాని మృతికి సంతాపం తెలుపుతూ కనీసం ఒక ట్విట్ కూడ చేయలేదనీ అంటూ శ్రీరామ్ స్నేహితుడు తన ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. 

అయితే ఈ విషయాలు అన్నీ మహేష్ దృష్టి వరకు వెళ్ళాయో లేవో తెలియకపోయినా ఇప్పుడు మహేష్ అభిమాని దయనీయ గాథ వైరల్ అవుతున్న నేపధ్యంలో ఈ విషయాల పై వాస్తవాలు తెలుసుకుని మహేష్ ఆ అభిమాని మృతికి కేవలం సంతాపం తెలపడమే కాకుండా మహేష్ తన వీరాభిమాని శ్రీరామ్ ఇంటికి వెళ్ళి అతడి తల్లిని ఓదార్చడం మంచిది అంటూ వస్తున్న సూచనలు ఎంత వరకు మహేష్ సీరియస్ గా తీసుకుంటాడో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: