తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 పై ఈ మద్య రక రకాల కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్ హోస్ట్ చేయడంగా మంచి పాపులారిటీ వచ్చింది. అప్పటి ఈ రియాల్టీ షోకి రేటింగ్ కూడా బాగా పెరిగిపోయింది.  ఇక బిగ్ బాస్ సీజన్ 2 కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా రాగా మొదట్లో కొన్ని విమర్శలు రావడం..ఇంటి సభ్యుల మద్య ప్రతిరోజూ ఏదో గొడవలు రావడం..కౌశల్ ఆర్మీ అంటూ తెగ హంగామా చేయడంతో బిగ్ బాస్ 2 ఏదో మమా అనిపించేలా జరిగింది.  ఇప్పుడు అంతా బిగ్ బాస్ సీజన్ 3 పై చర్చలు జరుపుకుంటున్నారు. 

ఈ సీజన్ కి ఎవరు హూస్ట్ గా రాబోతున్నారు..ఎవరు ఇంటి సభ్యులుగా ఉండబోతున్నారు అన్న విషయంపై ఉత్కంఠ రేకెత్తుతుంది. మరోవైపు ఇంటి బిగ్ బాస్ 3 ఇంటి సభ్యులు వీరే అంటూ ఈ మద్య కొందరి పేర్లు బయటకు రావడంపై కూడా చర్చజరుగుతుంది.  కాకపోతే  హౌస్ లో అడుగుపెట్టబోయే పార్టిసిపేట్స్ పై అయితే ఇంకా క్లారిటీ రాలేదు. 

అయితే బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా కూడా షోలో పార్టిసిపేట్ గా అడుగు పెట్టబోతున్నట్లు టాక్ రాగా ఆమె స్వయంగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తనపై వస్తున్న వార్తలపై గుత్తా జ్వాల కొట్టి పడేశారు.  అసలు బిగ్ బాస్ సీజన్ గురించి తాను ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదని..తాను బిగ్ బాస్ షోలో పార్టిసిపెట్ గా ఉన్నట్లు వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని సోషల మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. అంతే కాదు యాంకర్ శ్రీ ముఖి కూడా బిగ్ బాస్ 3 లో మెరవనున్నట్లు టాక్ వస్తోంది. వీటన్నటిపై సరైన క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.    


మరింత సమాచారం తెలుసుకోండి: