తెలుగులో నాగ చైతన్య, సమంత జంటలానే తమిళంలో ఆర్య సయేషా సైగల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కలిసి గజినికాంత్ సినిమాలో నటించి ఆ సినిమా టైంలోనే అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి హైదరాబాద్ లోనే గ్రాండ్ గా జరిగింది. పెళ్లి తర్వాత కూడా కెరియర్ కొనసాగించాలన్న ఆలోచనలో ఉన్న వీరు అనుకున్నట్టుగా సినిమాలు చేస్తున్నారు.


ఇక్కడ పెళ్లి తర్వాత కూడా ఫాం కొనసాగిస్తున్న చైతు, సమంతలానే.. అక్కడ ఆర్య, సయేషా సైగల్ పెళ్లి తర్వాత సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు పెళ్లి తర్వాత ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారు. జ్ఞానవెల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమా శక్తి సౌందర్ రాజన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు టెడ్డీ అని టైటిల్ ఫిక్స్ చేశారు.


పెళ్లి తర్వాత చైతు, సమంత కలిసి నటించిన మజిలీ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ సెంటిమెంట్ తోనే ఆర్య, సయేషా రియల్ లైఫ్ లానే రీల్ లైఫ్ లో భార్యా భర్తలుగా నటిస్తున్నారట. ఈ సినిమాతో పాటుగా కెవి ఆనంద్ కాపాన్ సినిమాలో కూడా ఆర్య, సయేషా నటిస్తున్నారని తెలుస్తుంది.


పెళ్లి తర్వత హీరో హీరోయిన్ గా నటించే జంటలకు భారీ క్రేజ్ ఉంటుంది. చైతు, సమంత నటించారు కాబట్టే మజిలీ సినిమాకు అంత మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి కోలీవుడ్ లో ఆర్య, సయేషా కూడా అలాంటి సందడి చేస్తారో లేదో చూడాలి. టెడ్డి సినిమా హిట్టైతే ఈ ఇద్దరి పెయిర్ మరింత క్రేజీగా మారి మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: